Special Trains: రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే వివిధ గమ్యస్థానాల మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించింది. ఆ రెండు గమ్య స్థానాల వివరాలు ఇవే.
| క్ర.సం | రైలు నం | ఎక్కడి నుంచి | ఎక్కడికి | సేవలు అందించే రోజు | పొడిగించిన కాలం | సర్వీసుల సంఖ్య |
| 1 | 07637 | తిరుపతి | సాయి నగర్ షిర్డీ | ఆదివారం (Sun) | 30.11.2025 నుంచి 28.12.2025 వరకు | 05 |
| 2 | 07638 | సాయి నగర్ షిర్డీ | తిరుపతి | సోమవారం (Mon) | 01.12.2025 నుంచి 29.12.2025 వరకు | 05 |
రైలు నంబర్ 07637 - తిరుపతి నుంచి సాయి నగర్ షిర్డీ వరకు నడిచే ఈ ప్రత్యేక రైలు సర్వీసు ఆదివారం రోజున నడుస్తుంది. ఈ సర్వీసులు 30.11.2025 నుంచి 28.12.2025 వరకు పొడిగించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ సర్వీసు మొత్తం ఐదు (05) ట్రిప్పులుగా నిర్ణయించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
రైలు నంబర్ 07638 - సాయి నగర్ షిర్డీ నుంచి తిరుపతి వరకు నడిచే ఈ రైలు సర్వీసు సోమవారం రోజున నడుస్తుంది. దీని పొడిగింపు కాలం 01.12.2025 నుంచి 29.12.2025 వరకు ఉంది, ఈ రైలు కూడా ఐదు (05) ట్రిప్పులు తిరగనుంది.
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీని దష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా పండుగలు, సెలవు దినాల్లో ప్రయాణించాలనుకునే వారికి ఈ రెండు సర్వీసులు సౌకర్యవంతంగా ఉంటాయి.