AP Governor Discharged from Manipal Hospital: 
అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ రెండు రోజుల కిందట అస్వస్థతకు గురయ్యారు.  మణిపాల్ హాస్పిటల్ డాక్టర్లు  ఆయనకు అపెండెక్టమీ సైతం రోబో సాయంతో నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండగా, ఆస్పత్రి నుంచి గవర్నర్ అబ్దుల్ నజీర్ డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ మేరకు మణిపాల్ హాస్పిట్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపుడి తాజా హెల్త్ బులెటిన్ లో తెలిపారు.




కడుపునొప్పితో హాస్పిటల్ లో చేరిన ఏపీ గవర్నర్ 
గవర్నర్ అబ్దుల్ నజీర్ కడుపునొప్పి కారణంగా సోమవవారం తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్ లో చేరారు. డాక్టర్లు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. మెడికల్ టెస్టుల్లో గవర్నర్ అక్యూట్ అపెండిసైటిస్ తో బాధ పడుతున్నారని డాక్టర్లు నిర్దారించారు. అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ కు రోబో సాయంతో అపెండెక్టమీ అనే సర్జరీ చేసినట్లు వైద్యులు తెలిపారు. సర్జరీ సక్సెస్ అయిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రెండు రోజుల కిందట విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో డాక్టర్లు పేర్కొన్నారు.