Assembly Monsoon Sessions 2023: అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ శాసనసభాపక్షం నిర్ణయించింది. పోరాటమే అజెండాగా ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిద్దామని జాతీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు, ప్రజా సమస్యలపై చట్టసభల వేదిక వదులుకోకూడదన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సభలో పోరాటం చేద్దాం, వీధుల్లోనూ పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్టు అక్రమమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని... సభలో మైక్ అవకాశం ఇవ్వకుంటే నిరసన ద్వారా సాధిద్దాని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై ఉద్యమించాలని నిర్ణయించారు.