Andhra Pradesh: రాకేష్ అనే వ్యక్తి పెళ్లి జరుగుతోంది. ముహూర్తానికి చాలా సమయం ఉంది. ఇంతలో ఓ వివాహిత అక్కడకు పాపతో వచ్చింది. రాకేష్ తనకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకుంటున్నాడని వాపోయింది. ఇది నిజమా అని ఆరా తీసేందుకు రాకేశ్ కోసం వెతికితే అతను జంప్ అయ్యాడు. ఇదంతా తిరుమల వేదికగా జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది. 


తిరుమలలో రాకేష్‌ అనే వ్యక్తి రెండోపెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఓ మఠంలో ఏర్పాట్లు జరుగుతున్న టైంలో మొదటి భార్య సంధ్య అక్కడకు కుమార్తెతో వచ్చారు. ఆమెను చూసిన రాకేష్ అక్కడి నుంచి పరారయ్యాడు.  


అక్కడ ఉన్న వారితో అసలు విషయం చెప్పారు. తనకు అన్యాయం చేసి రెండో వివాహానికి సిద్ధమయ్యాడని చెప్పుకొచ్చారు. తనకు తెలియకుండా రెండో వివాహం చేసుకుంటున్నాడని తెలిపారు. తనది తెలంగాణలోని వరంగల్‌ జిల్లా పెద్ద పెండ్యాలని వివరించారు. 


రాకేష్‌తో తనకు వివాదం ఉన్నమాట నిజమేనని... కోర్టులో వివాదం నడుస్తున్న తెలిపారు సంధ్య. ఇంకా ఆ వివాదంపై ఎలాంటి నిర్ణయం రాకుండానే రెండో వివాహానికి సిద్ధమైనట్టు తెలిపారు. రెండో వివాహం గురించి తెలుసుకున్న తాను ఇక్కడకు వచ్చినట్టు పేర్కొన్నారు. ఆ విషయంపై అడుగుదామని చూస్తే పారిపోయాడని అన్నారు. 


వివాదంపై తిరుమల అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి విషయాన్ని తెలుసుకున్నారు. తనకు తన కుమార్తెకు న్యాయం చేయాలని సంధ్య అభ్యర్థించారు. రాకేష్ ఫ్యామిలీని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొని వెళ్లి విచారణ చేస్తున్నారు.