Tirumala News Tpdates | తిరుమల: కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి భారీ విరాళం లభించింది. తమిళనాడులోని చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ తిరుమల శ్రీవారికి సుమారు రూ.2.40 కోట్లు విలువైన దాదాపు రెండున్నర కేజీల బంగారు శంఖు, చక్రాలను విరాళంగా అందించింది. మంగళవారం ఉదయం ఈ మేరకు సుదర్శన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి బంగారు శంఖు, చక్రాలను అందజేశారు.

---------------టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.