Supreme Court  Chandrababu Case  :   ఫైబర్ నెట్ స్కాంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ వాయిదా పడింది.  గత విచారణ సమయంలో చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై తీర్పు తర్వాత విచారణ చేస్తామని తెలిపామని ఆ తీర్పు ప్రాసెస్ లో ఉన్నందున విచారణను వాయిదా వేస్తున్నామని జస్టిస్ అనిరుద్ధబోస్ ధర్మాసనం తెలిపింది. క్వాష్ పిటిషన్ పై తీర్పు డిసెంబర్ పన్నెండో తేదీ  లోపు  వస్తుందని భావిస్తున్నారు. 


క్వాష్ పిటిషన్ పై తీర్పు అక్టోబర్ 18వ  తేదీన రిజర్వ్                               


స్కిల్ డెవలప్‌‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పును సుప్రీం కోర్టు అక్టోబర్ 18వ తేదీన రిజర్వ్ చేసింది. అప్పటి నుంచి తీర్పు పెండింగ్ లో ఉంది. గత విచారణ సమయంలో చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై తీర్పు తర్వాత విచారణ చేస్తామని తెలిపామని ఆ తీర్పు ప్రాసెస్ లో ఉన్నందున విచారణను వాయిదా వేస్తున్నామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. పన్నెండో తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  క్వాష్ పిటిషన్ పై తీర్పు డిసెంబర్ పన్నెండో తేదీ  లోపు  వస్తుందని భావిస్తున్నారు. 


చంద్రబాబు పిటిషన్లపై విచారణల్లో వరుస వాయిదాలు                         


చంద్రబాబుపై ప్రభుత్వం పెట్టిన ఇబ్బడిమబ్బడి కేసుల గురించి అటు ఏసీబీ కోర్టులో.. ఇటు హైకోర్టులో.. సుప్రీంకోర్టులో అదే పనిగా విచారణకు వస్తున్నాయి. కానీ క్వాష్ పిటిషన్ పై తీర్పు రాని కారణంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. చివరికి చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ కూడా ఈ కారణంగానే వాయిదా పడింది. ఆ కేసు పదకొండో తేదీకి వాయిదా పడింది. హైకోర్టులో కూడా వివిధ కేసుల్లో ముందస్తు బెయిల్స్ పై విచారణ కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. 


క్వాష్ పిటిషన్ తీర్పుపై ఉత్కంఠ                                   


క్వాష్ పిటిషన్  తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వస్తే.. ఆయన పై పెట్టి నకేసులన్నీ అక్రమం అని తేలుతాయి. కోర్టుల్లో ఉన్నవన్నీ తేలిపోతాయి. వాటికి విచారణ అర్హత కూడా ఉండదు. ఒక వేళ చంద్రబాబుకు 17ఏ వర్తించదని సుప్రీంకోర్టు చెబితే మాత్రం.. అన్ని కేసుల్లో విచారణలు దాదాపుగా పూర్తయినందున.. తీర్పులు వెల్లడించాల్సి ఉంటుంది. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో చంద్రబాబును రాజకీయానికి దూరం చేయాలనుకుంటున్న జగన్ రెడ్డి పన్నాగాలు వర్కవుట్ అవుతాయా లేదా అన్న క్వాష్ పిటిషన్ పై తీర్పును బట్టి వెల్లడయ్యే అవకాశం ఉండటంతో.. అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది.