డిపాజిట్‌దారులకు చెల్లింపులు చేయకుండా మోసం చేసిన కేసులో కృషి బ్యాంక్ డైరెక్టర్‌ కాగితాల శ్రీధర్ పోలీసులు అరెస్ట్ చేశారు. జనానికి కోట్ల రూపాయలు కుచ్చు టోపీ పెట్టి తప్పించుకొని తిరుగుతున్న ఆయన్ను, ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొల్లులోని శ్రీరాంపేటలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీఐడీ అధికారులు శ్రీధర్‌ను రిమాండ్‌కు తరలించారు. కృషి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్, ఎండీ కొసరాజు వెంకటేశ్వర్ రావు, డైరెక్టర్లతో కలిసి 36.37 కోట్ల రూపాయలను డిపాజిట్లుగా సేకరించారు. 


సికింద్రాబాద్‌లోని కృషి కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ డిపాజిటర్లకు చెల్లింపులు చేయకుండానే 2001 ఆగస్ట్ 11న మూసివేశారు. 2001, ఆగస్ట్ 11న డాక్టర్ ఎం.వీ. కుమార్ మహంకాళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారుతద్వారా బ్యాంకు చైర్మన్, డైరెక్టర్లు రూ. 36.37 కోట్ల మోసానికి పాల్పడ్డారు.  కృషి బ్యాంకు డైరెక్టర్‌గా వ్యహరించిన శ్రీధర్.. ఈ కేసులో 3వ నిందితుడిగా ఉన్నారు. విచారణ చేపట్టిన సీఐడీ, బ్యాంక్‌తో పాటు బ్యాంకు డైరెక్టర్ల ఆస్తులు అటాచ్ చేసింది. 


వాటిని విక్రయించి డిపాజిటర్లకు డబ్బులు పంచే బాధ్యతను లిక్విడేటర్‌కు కోర్టు అప్పగించింది. కోర్టు ఆదేశాల ప్రకారం.. బ్యాంక్, నిందితుల కొన్ని ఆస్తులను వేలం వేశారు. ఇప్పటివరకు 700 మందికి పైగా డిపాజిటర్లకు చెల్లింపులు చేశారు. మిగిలిన 173 మంది డిపాజిటర్లను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా వారిలో 75 మందిని గుర్తించారు.