AP MLC died in a road accident :  ఆంధ్రప్రదేశ్ లోని ఉండి సమీపంలో జరిగిన రోడ్ ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం పాలయ్యారు.  ప.గో జిల్లా ఉండి వద్ద ఓ కారును మరో కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.  షేక్‌ సాబ్జీ  ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్‌ తరపున 2021లో విజయం సాధించారు.   యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న షేక్‌ సాబ్జి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం విస్తృతంగా శ్రమించారు.  ఏలూరులో అంగన్ వాడీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపి  భీమవారం వెళ్తుండగా .. ఈ కారు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత తీవ్ర గాయాల పాలైన ఆయనను ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయారు.                                                                 

  


ఎమ్మెల్సీ ప్రయాణిస్తున్న కారుకు ఎదురుగా వస్తున్న కారు అదుపుతప్పి వీరు కారు ను ఢీకొనడంతో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది.  ఘటన స్థలంలో ఎమ్మెల్సీ మృతిచెందగా సీసీకి గాయాలయ్యాయి.  గన్‌మెన్‌కి  కూడా గాయాలయ్యాయి భీమవరం వర్మ ఆసుపత్రికి తరలించారు.   మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.   జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆసుపత్రికి చేరుకున్నారు.  ఎమ్మెల్సీ  స్వగ్రామం తూగో.. జిల్లా దేవరపల్లి మండలం ధూమంతుని గూడెం గ్రామం. 


ఏలూరు - భీమవరం మధ్య రోడ్ భారీగా గుంతలు పడి ఉంటుంది. ఈ కారణంగా వాహనాలు అదుపు తప్పుతున్నాయని కొంత కాలంగా వాహనదారులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఎమ్మెల్సీ కారుకు ఎదురుగా వస్తున్న వాహనం కూడా రోడ్ గంతల కారణంగానే అదుపు తప్పినట్లగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారు.                                               


ఎమ్మెల్సీ సాబ్జీ మృదు స్వభావి. ఉపాధ్యుల హక్కుల కోసం ఆయన పోరాడుతూనే ఉన్నారు. గురువుగా ఆయన ..  ఉద్యమంలో కూడా అదే రీతిన వ్యవహరించారు. అందుకే 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఏకపక్షంగా గెలిచారు. పలువురు పోటీ పడినప్పటికీ రెండు రౌండ్లలోనే విజయానికి కావాల్సిన యాభై శాతం ఓట్లను సాధించారు. ఆయన మృతితో ఉపాధ్యాయ సంఘాలన్నీ దిగ్భ్రాంతికి గురవుతున్నాయి.మంచి నాయకుడ్ని ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కోల్పోయాయని అనుకుంటున్నాయి.