Andhra Pradesh New Liquor Policy : ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ తీసుకు వచ్చింది. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు అంతా జే బ్రాండ్లను దింపి ప్రజల ఆరోగ్యాలను నాశనం చేశారని.. ప్రభుత్వం  గుప్పిట్లోనే అన్ని పెట్టుకుని భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ వచ్చారు. దానికి తగ్గట్లుగానే  టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే మద్యం విధానాన్ని మార్చేస్తామని ప్రకటించారు. ఆ ప్రకారం కొత్త పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు రెండేళ్ల పాటు కేటాయించేందుకు అప్లికేషన్లు ఆహ్వానించారు. అయితే ఈ దుకాణాల కోసం పెద్దగా డిమాండ్ ఉండటం లేదు. 


అప్లికేషన్ల ద్వారా రూ. 2 వేల కోట్లు వస్తుందనుకంటే ఇప్పటిదాకా రూ. 200 కోట్లే !


మద్యం దుకాణాలకు దరఖాస్తు చేయాలంటే రెండు లక్షల రుపాయలు పెట్టి అప్లికేషన్ కొనాలి. అది నాన్ రిఫండబుల్ .అంటే లాటరీలో మద్యం దుకాణం వచ్చినా రాకపోయినా ఆ  మొత్తం ప్రభుత్వానికే చెందుతుంది. తెలంగాణలో ఎన్నికలకు ముందు అక్కడి ప్రభుత్వం ఇలాగే దుకాణాల  కోసం అప్లికేషన్లు ఆహ్వానిస్తే రెండు వేల కోట్లకుపైగా వచ్చాయి. ఏపీలోనూ అలాగే వస్తాయని అనుకున్నారు. కానీ చివరి తేదీ సమీపస్తున్నా పెద్దగా  స్ందన కనిపించడం లేదు. ఇప్పటి వరకూ అప్లికేషన్ల ఫీజుగా రెండు వందల కోట్ల వరకే వచ్చినట్లుగా తెలుస్తోంది. 


ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్లు - ఐపీఎస్ సునీల్‌కుమార్‌పై చర్యలకు సిద్ధమైన ఏపీ సర్కార్


వ్యాపారులు రింగ్ అయిపోయారని ఆరోపణలు


ఓ ఏరియాలో మద్యం దుకాణం కోసం మూడు అప్లికేషన్లు వస్తే మూడింటిలోనూ లాటరీ తీసి ఒకరికి ఇస్తారు. ఇక్కడే వ్యాపారులు అతి తెలివి చూపిస్తున్నారని.. అప్లికేషన్లు తమ ఏరియాలో ఎవరు కొనుగోలు చేస్తారో వారికి ముందుగానే ఆఫర్లు ఇస్తున్నారని చెబుతున్నారు. ఓ ముగ్గురు మాత్రం.. తమలో ఎవరికి వచ్చినా సరే ముగ్గురు పార్టనర్లుగా ఉండి మద్యం దుకాణం నడిపించుకోవచ్చన్న ఒప్పంతో రింగ్ అయి ఆ ముగ్గురే దరఖాస్తులు పెడుతున్నారు. ఇతరులు మాత్రం మధ్యలోనే వెనక్కి వెళ్లిపోతున్నారు. ఈ వ్యాపారుల్లో టీడీపీ నేతలు, వారి అనుచరులు ఎక్కువగా ఉన్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మద్యం దుకాణం వ్సతే.. భారీగా ఆదాయం వస్తుంది కాబట్టి.. చాలా కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు వాటిని దక్కించుకునేందుకు అధికార దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. 


అప్లికేషన్లు తక్కువగా రావడం  పై ప్రభుత్వ ఫోకస్


మద్యం దుకాణాలకు అప్లికేషన్లు తక్కువగా వస్తూండటంతో తెర వెనుక ఏం జిరగిందన్నదనిపై ప్రభుత్వ పెద్దలు ఆరా తీస్తున్నారు. అప్లికేషన్ పెట్టుకోవాలని అనుకంటున్న వారిని ఎవరైనా అడ్డుకున్నట్లుగా తేలితే కఠఇన చర్యలు తీసుకుంటామని సంకేతాలు పంపుతున్నారు. అలాగే ఎవరూ రింగ్ కావొద్నది ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దని నేరుగానే  చెబుతున్నారు. అయితే చాలా మంది ఎమ్మెల్యేలు ఈ దందాకు దూరంగా ఉన్నప్పటికీ.. కొంత మంది మాత్రం.. ఇదే అవకాశం అనుకని.. రింగ్ అయ్యేలా వ్యాపారుల్న ిసిద్ధం చేస్తున్నరని చెబుతున్నారు. అప్లికేషన్ల గడువు ముగిసేలోగా ప్రభుత్వం అనుకున్న విధంగా స్పందన రాకపోతే గడువు పొడిగించే అవకాశం ఉంది.