తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు నంద్యాలలో వైద్యపరీక్షలు నిర్వహించారు. పాదయాత్ర విరామం తర్వాత నంద్యాల పద్మావతి నగర్ కు చేరుకున్న లోకేశ్.. ఓ MRI సెంటర్ కు వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. కుడి భుజం గాయంతో కొన్నాళ్లుగా లోకేష్ బాధపడుతున్నారు.


అనంతపురం జిల్లాలో పర్యటన సందర్భంగా భారీగా తరలి వచ్చిన కార్యకర్తల తోపులాటలో లోకేష్ కుడి భుజానికి గాయమైంది. అప్పటినుంచి వైద్యుల సలహాతో జాగ్రత్తలు తీసుకుంటున్నా..నొప్పి తగ్గకపోవటంతో డాక్టర్లు MRI స్కానింగ్ చేయించారు. దీనిపై వైద్యులు పూర్తి సమాచారాన్ని వెల్లడించాల్సి ఉంది.