Ganja Fact Check :  దేశవ్యాప్తంగా జరుగుతున్న గంజాయి స్మగ్లింగ్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉందంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీన్ని ఏపీ పోలీసులు నిర్వహిస్తున్న ఫ్యాక్ట్ చెక్ ఏపీ ఖండించింది. వరుసగా పోస్ట్‌లు చేస్తోంది. అసలు ఏది నిజమో  ఓ సారి చూద్దాం.  


నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో రిపోర్టు ప్రకారం ఏపీనే గంజాయి స్మగ్లింగ్‌లో టాప్ !
 
ఆంధ్రప్రదేశ్‌లో దొరికినంత గంజాయి మరే రాష్ట్రంలోనూ స్వాధీనం చేసుకోలేదని.. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) నివేదిక-2021 పేర్కొంది. ఈ విషయంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది.  దేశవ్యాప్తంగా పట్టుబడిన గంజాయిలో 26.75%  ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే గుర్తించారు. ఆ తర్వాతి స్థానంలో పొరుగు రాష్ట్రం ఒడిశా (1,71,713 కిలోలు) ఉంది. దేశంలో స్వాధీనం చేసుకున్న మొత్తం గంజాయిలో 50% ఈ రెండు రాష్ట్రాల్లోనిదే. ఏవోబీలో పెద్ద ఎత్తున గంజాయిని సాగు చేస్తూండటమే దీనికి కారణం. 


ఏపీ ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు !


ఎన్‌సీబీ రిపోర్టుతో  ఏపీ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. గత ఏడాది ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున దొరుకుతున్న గంజాయి కేసులు వెలుగు చూశాయి. పలువురు ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా ఏపీ నుంచే గంజాయి సరఫరా అవుతోందని అన్నారు. ఈ అంశంపై రాజకీయ దుమారం కూడా రేగింది. అయితే ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని.. గంజాయి స్మగ్లింగ్‌లో వైఎస్ఆర్‌సీపీ నేతల హస్తం ఉందని విపక్ష నేతలు ఆరోపణలు ప్రారంభించారు. 


ఆ ఫోటో పాతదన్న ఫ్యాక్ట్ చెక్ ఏపీ !


సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం అయ్యే ఫేక్ న్యూస్ గురించి ఫ్యాక్ట్ చెక్ చేసే ఫ్యాక్ట్ చెక్ ఏపీ ఈ అంశంపై స్పందించింది. ఆ వార్త వచ్చిన  ఫోటో .. తప్పుడు సమాచారం అని..  యూఎస్ నుంచి దిగుమతి చేసుకున్న అంశమని వివరించారు. అయితే ఇందులో కూడా నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో రిపోర్టు గురిచి ప్రస్తావించలేదు. ఈ కారణంగా చాలా మంది నెటిజన్లు... వార్త కరెక్టే.. ఫోటో తప్పా అని ఫ్యాక్ట్ చెక్ ఏపీని ప్రశ్నించారు. 





ఆ తర్వాత కాసేపటికే ఫ్యాక్ట్ చెక్ ఏపీ మరో ట్వీట్ చేసింది.  గంజాయి రవాణా కట్టడికి తీసుకుంటున్న చర్యలను వివరించింది. 





ఎన్‌సీబీ రిపోర్టు ప్రకారం..  పట్టుబడుతున్న గంజాయిలో అత్యధికం ఏపీ నుంచి వస్తున్నదని అధికారిక రికార్డుల్లో ఉంది. ఈ విషయాన్ని ఏపీ ఫ్యాక్ట్ చెక్ కూడా ఖండించలేదు.