Problems for the coalition government in Andhra Pradesh:  2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన, బీజేపీ కూటమి (NDA) 164 సీట్లతో అధికారంలోకి వచ్చింది.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కేవలం 11 సీట్లతో ప్రతిపక్షంగా మిగిలింది.  ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని జగన్ అసెంబ్లీకి రావడం మానేశారు.  ఈ "బలహీన ప్రతిపక్షం" కూటమి ప్రభుత్వానికి "సమస్యగా" మారిన సూచనలు కనిపిస్తున్నాయి.  తమకు "ఎదురు లేదని"   ఎమ్మెల్యేలు  కట్టుతప్పుతున్నారు.  

Continues below advertisement

హోదా లేదని ప్రతిపక్ష పాత్ర పోషించని వైసీపీ 

2024 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవడం రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేసింది.  అవినీతి ఆరోపణలు, పాలనలో  ఘోరాలు, రైతులు, మహిళలు, యువతలో అసంతృప్తి కారణంగా వైసీపీ ఘోరంగా ఉడిపోయింది.  వైసీపీకి ప్రతిపక్ష హోదాకు  అవకాశం లేకపోవడం  వల్ల.. అసెంబ్లీ రూల్స్ ప్రకారం 10% సీట్లు అవసరం అయినా రాకపోవడం వల్ల "సైలెంట్ ఓపోజిషన్" స్థితిని సృష్టించింది. ప్రతిపక్ష బలహీనత ప్రభుత్వానికి "ఫ్రీ పాస్" ఇస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ రాకపోవడం,  హౌస్ కమిటీల్లో ఉండకపోవ ఫలితంగా, ప్రభుత్వ నిర్ణయాలపై రాజ్యాంగ వేదికపై ప్రశ్నించడం తగ్గిపోయింది. 

Continues below advertisement

 ప్రతిపక్ష బలహీనత - ప్రభుత్వానికి సమస్య 

"సరైన ప్రతిపక్షం లేకపోవడం" కూటమి ప్రభుత్వానికి రెండు వైపులా సమస్యలు సృష్టిస్తోంది. ఎదురు లేకపోవడం వల్ల ప్రభుత్వం సులభంగా రీఫార్మ్స్ అమలు చేస్తోంది. జనసేన, బీజేపీలు కూటమి భాగస్వాములు కావడం వల్ల అంతర్గత విమర్శలు తక్కువ. కానీ  ప్రతిపక్షం లేకపోవడం "అకౌంటబిలిటీ"ను తగ్గిస్తుంది. వైసీపీ  అసెంబ్లీకి రాకపోవడం పార్లమెంటరీ డెమాక్రసీకి దెబ్బ అనుకోవచ్చు.   బలమైన ప్రతిపక్షం లేకపోవడం ప్రభుత్వాన్ని "అబ్యూజ్ ఆఫ్ పవర్"కు ప్రేరేపిస్తుంది. ఇప్పుడు అదే జరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. 

 ఎమ్మెల్యేలు "ఎదురు లేదని" కట్టుతప్పుతున్నారా?  

ప్రతిపక్ష బలహీనత వల్ల కొంతమంది ఎమ్మెల్యేలు "కట్టుతప్పుతున్నారన్న"ఆరోపణలుపెరిగాయి.   ఎదురు లేకపోవడం వల్ల "చెక్స్ అండ్ బాలెన్సెస్" లేకపోవడం అనైతికతకు దారి తీస్తుంది. ప్రతిపక్షం లేకపోవడం వల్ల ఎమ్మెల్యేలు "సెల్ఫ్-సర్వింగ్" మోడ్‌లోకి వెళ్లారు.అందుకే ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీతో పాటు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా కొంత మంది ప్రత్యేకంగా దందాలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. స్వయంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేల తీరుపై హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే వారిలో ఎంత మంది పట్టించుకుంటున్నారో లేదో స్పష్టత లేదు. ఎమ్మెల్యేల వల్ల ప్రభుత్వానికి ఎంతో ఇబ్బంది ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

టీడీపీ, జనసేన మధ్య పెరుగుతున్న ఇన్ ఫైటింగ్                          ప్రతిపక్షం లేకపోవడం వల్ల "ఇన్‌ఫైటింగ్" పెరిగే అవకాశం కనిపిస్తోంది.  టీడీపీ-జనసేన మధ్య ఇలాంటివి తరచూ కనిపిస్తున్నాయి.  ప్రభుత్వంలో ఉన్నప్పుడు వివిధ అంశాలపై వేర్వేరు అభిప్రాయాలు సహజమే కానీ.. అవి ప్రతిపక్షం లేకపోవడం వల్ల రావడం సమస్యలు సృష్టిస్తుంది.  ప్రతిపక్షం లేకపోవడం  వల్ల అకౌంటబిలిటీని తగ్గించి, అనైతిక ప్రవర్తనలకు  దారి తీస్తోంది. ఎమ్మెల్యేలు "ఎదురు లేదని" లాభపడుతున్నారనే ఆరోపణలు నిజమవుతున్నాయి. ఇది లాంగ్-టర్మ్‌లో ప్రభుత్వానికి బూమరాంగ్ అవుతుంది. అందుకే కూటమి ప్రభుత్వం జాగ్రత్త పడాల్సిన అవసరం కనిపిస్తోంది.