శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు పోలీసులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. భైరిసారంగపురంలో ఓ జవాను మృతదేహం అప్పగించారు ఏఆర్‌ కానిస్టేబుళ్లు. అనంతరం బొలెరో వాహనంలో తిరుగు ప్రయాణం  అయ్యారు. వస్తుండగా సుమ్మాదేవి దగ్గర జాతీయ రహదారిని క్రాస్ చేస్తుండగా... వీరి వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వాహనం నుజ్జునుజ్జయింది.


ఈ ఘటనలో నలుగురు కానిస్టేబుళ్లు కె.కృష్ణుడు (ఏఆర్‌ ఎస్సై ), వై. బాబూరావు (హెచ్​సీ), పి. ఆంటోనీ (హెచ్​సీ), పి. జనార్దనరావు (డ్రైవర్‌) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 


సీఎం జగన్ సంతాపం


రోడ్డు ప్రమాదంలో పోలీసులు మృతి చెందడంపై మృతి చెందిన పోలీసులు మృతి చెందటం పట్ల  ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.బాధిత కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


Also Read: Punganur: స్కూటీపై ఇద్దరు అమ్మాయిలు దర్జాగా వచ్చి ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది... నవ్వు కూడా ఆగదు


పోలీసుల మృతి ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. సమగ్ర దర్యాప్తు జరిపి వివరాలు అందించాలని జిల్లా ఎస్పీతో పాటు ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో నలుగురు పోలీసుల మరణం మా పోలీస్ కుటుంబానికి తీరని లోటని డీజీపీ సవాంగ్ తెలిపారు. మరణించిన పోలీస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ వారి కుటుంబలకు అండగా ఉంటుందన్నారు.




ఈ ఘటనపై  టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధినిర్వహణలో ఉన్న నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. వారి ఆత్మకు శాంతికలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. మృతి చెందిన పోలీసు  కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.

 



Also Read:Hyderabad Murder: చార్మినార్ మధుసూధన్ హత్య కేసులో వీడిన మిస్టరీ.. అసలు విషయం తేల్చేసిన పోలీసులు


    Google Bans 8 Apps: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ క్రిప్టోకరెన్సీ యాప్స్ ఉన్నాయా.. వెంటనే డిలీట్ చేసుకోండి.. ఎందుకంటే..!