Fire From Borewell In Konaseema District: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ (Konaseema) జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. బోరు నుంచి ఒక్కసారిగా మంటలు రావడం చూసి స్థానికులు ఆందోళన చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మలికిపురం (Malikipuram) మండలం దిండి కాసవరపు లంకలో చెరువుల వద్ద మంచినీటి బోరు వేస్తుండగా.. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దీనిపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికంగా ఉన్న గ్యాస్ పైప్ లైన్ వల్లే మంటలు వచ్చినట్లు భావిస్తున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో ఓఎన్జీసీ అధికారులు సైతం అక్కడికి వచ్చి పరిశీలించారు.
Konaseema News: షాకింగ్ ఘటన - బోరు వేస్తుండగా ఒక్కసారిగా మంటలు, ఎక్కడంటే?
ABP Desam | 22 Apr 2024 03:31 PM (IST)
Andhrapradesh News: బోరు వేస్తుండగా ఒక్కసారిగా మంటలు రావడంతో అంతా షాకయ్యారు. కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో దిండి కాసవరపు లంకలో ఈ ఘటన జరిగింది.

బోరు నుంచి ఒక్కసారిగా మంటలు
Published at: 22 Apr 2024 03:27 PM (IST)