Expelled Telugu Desam Party leader Jayachandra Reddy arrested:  రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసు రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా పేరుకున్న తెలుగుదేశం పార్టీ  బహిష్కృత నేత డి. జయచంద్రారెడ్డిని ఎక్సైజ్ పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఆయన్ను రాష్ట్రానికి తీసుకువచ్చి మదనపల్లె ఎక్సైజ్ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు.   కేసులో అరెస్టుల సంఖ్య 32కి చేరింది. ప్రధాన సూత్రధారి అద్దేపల్లి జనార్దన్ రావుతో జయచంద్రారెడ్డి మధ్య ఆర్థిక సహకారాలు, చీకటి ఒప్పందాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.  అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలంలో గత ఆక్టోబర్‌లో ఎక్సైజ్ శాఖ అధికారులు నకిలీ మద్యం తయారీ యూనిట్‌ను బయటపెట్టారు. ఇక్కడ రోజుకు వేలాది లీటర్ల నకిలీ మద్యాన్ని  తయారుచేసి, బెల్ట్ షాపులు, బార్‌లకు సరఫరా చేస్తూ లక్షలాది రూపాయల లాభాలు పొందినట్లు తేలింది. ఈ యూనిట్‌లో ఇండస్ట్రియల్ స్పిరిట్, మెథనాల్ వంటి మర్మమైన పదార్థాలను కలిపి తక్కువ ధరకు మద్యాన్ని తయారుచేసి, అసలు బ్రాండ్ లేబుల్స్‌తో బాటిల్స్ సిద్ధం చేసి అమ్ముతున్నారు. 

Continues below advertisement

ప్రధాన నిందితుడు (ఏ-1) అద్దేపల్లి జనార్దన్ రావు, విజయవాడలో ఏఎన్‌ఆర్  నిర్వాహకుడు. ఆయన సోదరుడు అద్దేపల్లి జగన్ మోహన్ రావు సహా 14 మంది ప్రధాన నిందితులు ఈ రాకెట్‌ను నడిపారు. రిమాండ్ రిపోర్టుల ప్రకారం, జనార్దన్ రావు దక్షిణాఫ్రికా, రgవాండా వంటి దేశాల్లో మద్యం ఫ్యాక్టరీలు నడుపుతూ, ఆ అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 31 మంది అరెస్టులు జరిగాయి. జనార్దన్ రావును గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేశారు.  రిమాండ్ రిపోర్టుల్లో గుర్తించినట్లుగా, ఈ నకిలీ మద్యం తయారీ వ్యవహారమంతా జయచంద్రారెడ్డి కనుసన్నల్లోనే సాగింది. జనార్దన్ రావుకు ఆర్థిక సహకారాలు, రక్షణ అందించినట్లు పోలీసులు ఆరోపించారు.   చీకటి ఒప్పందాలు ఉన్నాయనే  ఆధారాలు బయటపడ్డాయి.  జనార్దన్ రావు వీడియోలో జయచంద్రారెడ్డికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పినప్పటికీ, పోలీసులు ఆయన పాత్రను దర్యాప్తు చేస్తున్నారు. 

జయచంద్రారెడ్డి (ఏ-17) తంబళ్లపల్లె నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయన తర్వాత టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉండగా ఈ లిక్కర్ స్కాం బయటపడిన తరవాత పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.  ఆయన బావమరిది గిరిధర్ రెడ్డి (ఏ-18) కూడా నిందితుల్లో ఉన్నారు. ఆయన పీఏ రాజేష్, అకౌంటెంట్ అన్బురాజ్, కారు డ్రైవర్ సయ్యద్ కలీం అష్రఫ్, ఇంటి బాబు అన్బురాసు వంటి సన్నిహితులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్టులు జయచంద్రారెడ్డి పాత్రను మరింత స్పష్టం చేస్తున్నాయి. జయచంద్రారెడ్డి మొదట బీఈ చదివి, బెంగళూరులో ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఇంజినీర్‌గా పనిచేశారు. తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2024 ఎన్నికల ముందు వైసీపీ (YSRCP) నుంచి టీడీపీలో చేరారు. అనంతపురం జిల్లా తంబళ్లపల్లె అసెంబ్లీ  నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు.  ఈ కేసు బయటపడిన తర్వాతే టీడీపీ ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆక్టోబర్ 6న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు జయచంద్రారెడ్డి, స్థానిక నేత కట్టా సురేంద్ర నాయుడులను సస్పెండ్ చేశారు.   

Continues below advertisement