AP Voters List : ఏపీలో దొంగ ఓట్లు ఎక్కువగా నమోదవుతున్నాయని  కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో ఫిర్యాదు చేశారు.  ఫిర్యాదుపై విచారణ జరిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో జీరో హౌస్ నెంబర్ పై 2,51,767 ఓట్లు, పది ఓట్లకు మించి ఒకే డోర్ నెంబర్ పై 1,57,939 ఇళ్ళలో 24,61,676 దొంగ ఓట్లు నమోదైనట్టు గుర్తించామని సమాచారం పంపింది.  వీటిలో ఇప్పటి వరకు జీరో హౌస్ నెంబర్ పై నమోదైన 61,374 దొంగ ఓట్లను, పది ఓట్లకు మించి ఒకే డోర్ నెంబర్ పై నమోదైన ఇళ్ళ నుండి 21,347 ఇళ్ళను తొలగించామని సమాధానం పంపింది.  మిగిలిన వాటిపై చర్యలు తీసుకుని అర్హత లేని ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని, ఇకపై ఇటువంటి దొంగ ఓట్లు నమోదు కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ వివరాలతో  చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం ఎంపీ రఘురామకు నివేదికను పంపింది.


ఏపీలో ఓటర్ల జాబితా అంశంపై చాలా కాలంగా దుమారం రేగుతోంది.  రాష్ట్రంలో చనిపోయిన వారి ఓట్లు తొలగించకపోవడం, దొంగ ఓట్లు నమోదు చేయడం, టీడీపీకి అనుకూలం అని భావించే వారి ఓట్లను తొలగించడం, ఒక బూత్‌లో ఓట్లను మరో బూత్‌కు బదలాయించడం వంటి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని తాము ఎన్నికల సంఘాన్ని  చంద్రబాబు కోరారు.  అధికార వైసీపీ దొంగ ఓట్లతో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ నేతలు కొంత కాలంగా ఆరోపిస్తున్నారు.   


ప్రజాస్వామ్యంలో ఓటర్లు ముఖ్యం.  దేశంలో పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు  హక్కు ఉంటుంది. కానీ ముందుగా జాబితాలో ఉండాలి. అలా జాబితాలో లేకుండా ఎవరికైనా ఓటు నిరాకరిస్తే ఇక ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. అందుకే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఓటర్ల జాబితా అంశంలో సీరియస్ గానే ఉంటారు. చాలా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా జోలికి అధికార పార్టీలు కూడా వెళ్లవు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికలకు ఈసీ వద్ద ఉన్న ఓటర్ల జాబితాను తీసుకుని తాము సొంతంగా ప్రిపేర్ చేసుకుంటాయి  రాష్ట్ర ఎన్నికల సంఘాలు. అప్పుడు కొన్ని ఓట్లు గల్లంతవుతాయన్న  ఆరోపణలు వస్తాయి. కానీ ఇప్పుడు ఏపీలో  అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేయాల్సిన వారి జాబితా మ్యానిపుల్టే అయిపోయిందన్న ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. 


ప్రతీ నియోజకవర్గంలో ఐదు నుంచి పది వేల ఓట్లు  ప్రత్యర్థి పార్ట సానుభూతి పరులవి తప్పిస్తే ఫలితం తారుమారవుతుంది. కానీ ప్రజాస్వామ్యం తలకిందులవుతుంది. ఇప్పుడు ఏపీలో ఏదే చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. పర్చూరులో ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఈసీకి చేసిన ఫిర్యాదులో ఓట్ల తొలగింపు కోసం అధికారులు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారని వెల్లడించారు. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి,  మంత్రి సీదిరి అప్పలరాజు నేరుగానే మన పార్టీ ఓట్లు కాకపోతే అబ్జెక్షన్ చెప్పాలని క్యాడర్ ను ఆదేశించారు. అంటే అధికార పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగానే  ఓట్లను తొలగించే ప్రయత్నం  చేస్తున్నారని ఎన్నికల సంఘానికి వరుసగా ఫిర్యాదులు చేశారు.