Kesineni Nani :  బెజవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని పార్టీ మార్పు పై భారీగా ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్లమెంట్ స్దానానికి పోటీ పడుతున్న కేశినేని వచ్చే ఎన్నికల్లో అసలు బరిలో  ఉండరన్న ప్రచారం కూడా జరుగుతోంది.  కేశినేని కొంత కాలంగా పార్టీకి  , పార్టీ అగ్రనాయకత్వానికి   దూరంగా ఉంటున్నారు.    పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర బెజవాడకు వచ్చినప్పడు ఆయన ఆ కార్యక్రమానికి హజరు  కాలేదు. దీంతో ఇక ఆయన పార్టీ నుండి దూరం అవటం ఒక్కటే మిగిలి ఉందనే ప్రచారం ఊపందుకుంది.   అయితే దీని పై అటు కేశినేని నాని కాని, ఆ పార్టీలోని కీలక నేతలు కాని అసలు నోరు విప్పటం లేదు 


పాదయాత్రకు హాజరు కాకపోవడంపై స్పందించని కేశినేని నాని  


లోకేష్ తో పాదయాత్రలో పాల్లొనకపోవటం వెనుక కారణలు చెప్పేందుకు   కేశినేని నాని అస్సలు ఇంట్రస్ట్ చూపించలేదు. ఆయన మౌనం పై కూడ సొంత పార్టీ కి చెందిన నాయకుల్లో నే రక రకాలుగా రూమర్స్ క్రియేట్ అయిపోతున్నాయి. అయినా వాటిని  కేశినేని పట్టించుకోవటం లేదు.  కేశినేని నాని తీరు , ఆయన వ్యవహర శైలి పై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో  చర్చకు దారి తీసింది. ఇటీవల కాలంలో నందిగామకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసన సభ్యుడు మెండి తోక జగన్ మోహన్ రావుతో, కలసి అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న కేశినేని ఆయన్ను అభినందించారు. అంతే కాదు మైలవరం శాసన సభ్యుడిగా ఉన్నవసంత తో కూడ కేశినేని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 


వైసీపీతో టచ్‌లో ఉన్నారని ప్రచారం


ఆయన తీరుతో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారని   ఊహాగానాలు వినిపించాయి. అయితే  ఇటీవల కేశినేని నాని ఇంటిలో ఆయన కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమం లో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొనడంతో అంతా సైలెంట్ అయ్యిపోయారు. అయితే ఇప్పుడు లోకేష్ నిర్వహించిన యువ గళం పాదయాత్రకు సైతం పార్లమెంట్ సభ్యుడుగా ఉన్న కేశినేని నాని హజరు కాలేదు. అంతే కాదు ఇటీవల చంద్రబాబు నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమం విజయవాడలో జరిగిన సమయంలో కూడ కేశినేని నాని దూరంగా ఉన్నారు. ఇలా వరుసగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, అధికారికంగా నిర్వహించే కార్యక్రమాల్లో అధికార పార్టీకి చెందిన నాయకులతో కలసి పాల్గొనటం, అధికారులను వెంట పెట్టుకొని నాని ముందుకు వెళ్ళటం వెనుక కారణాలు పై  చర్చ జరుగుతోంది.


వస్తే  వైసీపీ టిక్కెట్ ఇస్తారనే సంకేతాలు


వైసీపీలో ప్రస్తుతం విజయవాడ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థి ఎవరూ లేరు. గత ఎన్నికల్లో పోటీ చేసిన పీవీపీ తర్వాత పెద్దగా యాక్టివ్ రాజకీయాల్లో లేరు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఈ సారి పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది.  విజయవాడ పార్లమెంట్ స్దానం వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఖాళీగా ఉంది కాబట్టి, ఆయన వచ్చినా ఆశ్చర్యం లేదని వైసీపీ కీలక నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇదంతామైండ్ గేమ్ అని.. ఆయన పోటీ చేయకుండా అయినా ఉంటారు కానీ వైసీపీ తరపున పోటీ చేయరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొత్తంగా కేశినేని నాని మాత్రం హాట్ టాపిక్ అవుతున్నారు.