Chandrababu :  2047 నాటికి  భారత్ నెంబర్ వన్ ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే సంస్థ నిర్వహించిన మేధోమథన సదస్సులో చంద్రబాబు మాట్లాడారు.   ఈ కార్యక్రమానికి జీఎఫ్ఎస్‌టీ చైర్మన్ హోదాలో చంద్రబాబు హాజరయ్యారు. ఐటీతో ప్రపంచమంతా భారతీయులు విస్తరించారని తెలిపారు. తెలుగు ప్రజలు టార్చ్‌ బేరర్‌గా నిలుస్తారని చంద్రబాబు చెప్పారు. ఈ కార్యక్రమానికి జీఎఫ్ఎస్‌టీ చైర్మన్ హోదాలో చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే అన్నీ సాధ్యమేనని చెప్పారు.          

    

ఐటీతో ప్రపంచమంతా భారతీయులు విస్తరించారని తెలిపారు. 2047 నాటికి భారత్‌ నెంబర్‌వన్‌గా అవతరించనున్నదని పేర్కొన్నారు. తెలుగు ప్రజలు టార్చ్‌ బేరర్‌గా నిలుస్తారని చంద్రబాబు చెప్పారు.   *గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్‌ కు చైర్మన్ గా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు.  ఆర్థిక రంగ నిపుణులు, పర్యావరణ వేత్తలు, రిటైర్డ్ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పని చేసిన అధికారులు, కార్పొరేట్ ప్రముఖులు, విద్య, వైద్య, న్యాయ, మీడియా రంగ నిపుణులు, కార్పొరేట్ రంగ వ్యక్తులతో మూడేళ్ల క్రితం ఏర్పాటైంది  GFST.                  

                

 పాలసీల రూపకల్పన, రీసెర్చ్, నాలెడ్జ్ షేరింగ్ అనే అంశాలపై పనిచేస్తున్నది జిఎఫ్ఎస్టి.   *2047 నాటికి 100 ఏళ్ల స్వాతంత్ర్య దేశంగా భారత దేశంగా ఉంటుందని..  దీనిలో భాగంగా స్ట్రాటజీస్ ఫర్ ఇండియా @100 అనే కాన్సెప్ట్‌పై పనిచేస్తున్నది  గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్.  ఈ ఏడాది డీప్ టెక్నాలజీస్, లాజిస్టిక్స్, ఫార్మా అండ్ హెల్త్ కేర్ సెక్టార్లపై సదస్సులు నిర్వహిస్తున్నారు.  అందులో భాగంగా నడీప్ టెక్నాలజీస్ అనే అంశంపై నేడు జరిగిన సదస్సు నిర్వహించారు. ఇందులో  న్న నారా చంద్రబాబు నాయుడు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.  భారత దేశం ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా మారడానికి తీసురావాల్సిన పాలసీలు, టెక్నాలజీ పాత్రపై నేటి సదస్సులో చర్చ జరుగుతుందన్నారు.

ప్రపంచంలోనే భారత్ నెంబర్‌ వన్ ఆర్థిక వ్యవస్థగా మారడానికి తీసుకురావాల్సిన విధానాలు, టెక్నాలజీపై ఈ సదస్సులో చర్చించారు. పాలసీల రూపకల్పన, రీసెర్చ్, నాలెడ్జ్ షేరింగ్ అంశాలపై జీఎఫ్ఎస్‌టీ పనిచేస్తోంది. జీఎఫ్ఎస్‌టీ ఎలాంటి లాభాపేక్ష లేని సంస్థగా పనిచేస్తోంది. ఇది మూడేళ్ల కిందట ఏర్పాటైంది. ఆ సంస్థలో ఆర్థిక నిపుణులు, పర్యావరణ వేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన అధికారులు, మీడియా రంగానికి చెందిన ప్రముఖులున్నారు.