గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గానికి చెందిన రైతు నరేంద్రను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. మద్దతు ధర అడిగితే అక్రమంగా కేసు పెట్టడమేంటని ప్రశ్నించారు. అన్నదాతలకు ప్రభుత్వం తప్పకుండా క్షమాపణలు చెప్పాలన్నారు. శావల్యాపురానికి చెందిన రైతు నరేంద్ర ఎలాంటి తప్పు చేయలేదన్నారు. సంక్రాంతి పండగ రోజున నరేంద్ర జైలులో ఉండటానికి కారణమైన వైసీపీ ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. పండుగ రోజున అన్నదాత కుటుంబం క్షోభకు కారణమైన ప్రభుత్వాన్ని.. రైతులు క్షమించరన్నారు. 


మద్దతు ధర అడగడమే.. ఆ రైతు చేసిన తప్పైందని.. అలాంటి ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.  జగన్ ప్రభుత్వం.. మెుత్తం ప్రభుత్వాన్నే.. అవమానించిందని చెప్పారు. వినుకొండ ఎమ్మెల్యే ఆదేశాలతోనే.. అక్రమ కేసు పెట్టినట్టు తెలిసిందని చంద్రబాబు అన్నారు. తప్పుడు కేసు పెట్టిన వినుకొండ రూరల్ సీఐ అశోక్ కుమార్ సస్పెండ్ అయ్యారన్నారు. ప్రభుత్వం తన తప్పు తెలుసుకుని వెంటనే రైతు నరేంద్రను విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. నరేంద్ర కుటుంబానికి పరిహారం చెల్లించాలన్నారు.














 


Also Read: జంగాలు వచ్చి గంట వాయిస్తేనే సంక్రాంతికి పెద్దలు వచ్చేది... సిక్కోలులో ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం...


Also Read: Tirupati: తిరుమలలో ఇదేందయ్యా సామీ.. శ్రీనివాసుడి సన్నిధిలో నిబంధనలు తుంగలో తొక్కుతున్న నేతలు