PG Medical Seats in AP: ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒకేసారి 630 పీజీ వైద్య సీట్లను రాష్ట్రానికి కేటాయించింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ అండర్ సెక్రటరీ చందన్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుమతిస్తూ... లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనంగా పీజీ వైద్య విద్య సీట్లు పెంటేందుకు అవసరమైన మైలిక వసతుల కల్పనకు రూ.453.6 కోట్లు ఆర్థిక సాయం చేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అనుతించినట్లు తెలిపారు. ఈ మేరకు ఎంఓయూ పంపిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇందుకు ఏపీ సర్కారు కళాశాల వారీగా ఎంఓయూకు ఆమోదం తెలపాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలలు రెండు నెలల కిందర సెంట్రల్ స్పాన్సర్ షిప్ కింద 688 సీట్లకు ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనలు పరిశీలించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ 630 పీజీ వైద్య సీట్లకు ఆమోద ముద్ర వేసింది. 


కళాశాలల వారీగా కొత్తగా వచ్చిన పీజీ సీట్లు..


విశాఖ ఏఎంసీ కాలేజీకి 128, ఒంగోలు జీఎంసీకి 79, తిరుపతి ఎస్వీఎంసీ కాలేజీకి 75, విజయవాడ సిద్ధార్థ కళాశాలకు 71, కడప జీఎంసీకి 69, అనంతపురం జీఎంసీ కాలేజీకి 65, కాకినాడ ఆర్ఎంసీ కళాశాలకి 46, కర్నూల్ కేఎంసీ కాలేజీకి 41, గుంటూరు జీఎంసీ కళాశాలకి 34, శ్రీకాకుళం జీఎంసీకి 17, నెల్లూరు ఏపీఎస్ఆర్ కాలేజీ 5 సీట్లకు ఆర్థిక సాం చేస్తున్నట్లు తెలిపారు. 


ఇన్ని సీట్ల కేటాయించడానికి కారణం ఏంటంటే..?


రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం జరిపినందునే పీజీ సీట్లు మంజూరు చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. గత మూడున్నరేళ్లలో దాదాపు 455 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను శాశ్వత ప్రతిపాదికన నియమించారు. 2,500 మందికి పైగా పారామెడికల్ సిబ్బందిని నియమించారు. అలాగే నాడు-నేడులో భాగంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కళాశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇవన్నీ చేయడం వల్లనే కేంద్రం కొత్త పీజీ వైద్య సీట్లకు ఆమోద ముద్ర వేసింది. తాజాగా మంజూరైన సీట్లలో జనరల్ మెడిసన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్ ఇలా సుమారు 18 విభాగాలకు సంబంధించిన పీజీ వైద్య సీట్లను ఉన్నాయి. అత్యధికంగా ఆంధ్రా మెడికల్ కళాశాలకు 128 సీట్లు రాగా.. అత్యల్పంగా నెల్లూరు మెడికల్ కలాజేకి 5 సీట్లు వచ్చాయి. 


సూపర్ స్పెషాలిటీ సేవలు.. 


కొత్తగా పీజీ వైద్య సీట్లతో పాటు సూపర్ స్పెషాలిటీ సీట్లు కూడా వచ్చాయని కర్నూల్ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్, డాక్టర్ హరిచరణ్ అన్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా కొత్తగా సీట్లు వచ్చాయని... దీని వల్ల సామాన్యులకు స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పరిధిలో సీట్లు పెరగడం పేద వైద్య విద్యార్థులకు మంచి పరిణామం అన్నారు.