AP SIT arrests money launderer Anil Chokra: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో జరిగిన మద్యం విధాన కుంభకోణంలో మరో కీలక నిందితుడు అరెస్టయ్యాడు. ముంబైకు చెందిన  అనిల్ చోకరాను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆయనను విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకువచ్చి ప్రశ్నిస్తున్నారు. ఈ అరెస్ట్‌తో మద్యం సిండికేట్‌లకు చెల్లించిన ముడుపులు, బ్లాక్ మనీ మార్పిడి విషయాలు మరింత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.                      అనిల్ చోకరా  ముంబై  కేంద్రంగా పనిచేసే మనీ లాండరింగ్ నిపుణుడు. గతంలో రెండుసార్లు మనీ లాండరింగ్ కేసుల్లో అరెస్టయ్యాడు. ఈ కేసులో అతడిని 49వ నిందితుడిగా చేర్చారు.  ముంబైలో షెల్ కంపెనీల ద్వారా అక్రమ డబ్బును మార్చడంలో ప్రసిద్ధి చెందాడు. ఏపీ మద్యం కుంభకోణంలో అతని పాత్ర చాలా కీలకంగా ఉంది, ఎందుకంటే అతను బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి, మద్యం వ్యాపారంలో పెద్దలకు చేర్చడంలో ముఖ్యమైన లింక్‌గా పనిచేశాడు. ఏపీ మద్యం విధానంలో జరిగిన అక్రమాలు, ముడుపులు, షెల్ కంపెనీల ద్వారా  * ఏ1 నిందితుడు కాసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏ7 నిందితుడు ముప్పిడి అవినాశ్ రెడ్డి లకు సంబంధించిన బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడంలో కీలకపాత్ర పోషించాడు.                       

Continues below advertisement

మద్యం సిండికేట్‌లు 'ఆదాన్', 'లీలా', 'ఎస్‌పీవై' వంటి కంపెనీల నుంచి సేకరించిన రూ. 77.55 కోట్లు  ముంబైకి చెందిన నాలుగు షెల్ కంపెనీల ద్వారా వైట్ మనీగా మార్చారు.  చట్టానికి దొరకకుండా ఉండేలా 32 ఇతర షెల్ కంపెనీలకు వివిధ మార్గాల ద్వారా నగదుగా పంపిణీ చేశారు. ఈ డబ్బును మద్యం సిండికేట్‌లకు, అప్పటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులుగా చెల్లించారు.  ఈ కుంభకోణం వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ కాలంలో జరిగింది.  ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది.                      

అనిల్ చోక్రా ఆర్థిక నేరాల్లో దిట్ట.   అతను ఇప్పటికే రెండుసార్లు మనీ లాండరింగ్ కేసుల్లో అరెస్టయ్యాడు. ఇవి ప్రధానంగా 2017-2018లో జరిగిన ఫేక్ ఇంపోర్ట్ రెమిటెన్స్ స్కామ్‌లకు సంబంధించినవి. ఈ కేసుల్లో ఇండస్‌ఇండ్ బ్యాంక్‌కు రూ. 1,100 కోట్లకు పైగా నష్టం కలిగించారని కేసు నమోదు అయింది.   ఏప్రిల్ 2017 మొదటి సారి ఈడీ అరెస్టు చేసింది.   డూప్లికేట్ బిల్స్ ఆఫ్ ఎంట్రీలను వివిధ బ్యాంకులకు సమర్పించి, లెజిటిమేట్ ఇంపోర్ట్‌లను ఫేక్‌గా చూపించారు.  2018 లో    ఫేక్ డాక్యుమెంట్లతో ఫ్రాడ్ చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు.   ED ఆస్తులు అటాచ్ చేసింది.  2022లో బాంబే హైకోర్టు బెయిల్ ఇచ్చింది.అయితే ఆయన పద్దతి మార్చుకోలేదు.  ఆర్థిక అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు. 

Continues below advertisement