AP High Court :  పర్చూరు  ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.  పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిది.   పోలీసులు అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితేంటని  ప్రశ్నించింది.   ఏడేళ్ల లోపు జైలు శిక్షకు వీలున్న కేసుల్లో సెక్షన్ 41ఏ నోటీసు ఇవ్వాలి .. నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాల్సి ఉంటే అరెస్టుకు ఎలా ప్రయత్నిస్తారని హైకోర్టు ప్రశ్నించారు.  అరెస్టు చేస్తే బాధ్యులు పరిణామాలు ఎదుర్కొంటారని...  బాధ్యులైన అధికారి అరెస్టుకు ఆదేశాలిస్తామని స్పష్టం చేసిన హైకోర్టు హెచ్చరించింది.  ఎవరో ఒక ఉన్నతాధికారిపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేటట్లు లేదని  హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసారు.  వివరాల సమర్పణకు  అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరండతో  విచారణ మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు. 


విధులకు ఆటంకం  కలిగించారని మైనింగ్ అధికారి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేలపై కేసు              


ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రానైట్‌ కంపెనీల్లో ఇటీవల తనిఖీలకు వచ్చిన మైనింగ్‌ అధికారుల విధులకు ఆటంకం కలగించారని ఆరోపిస్తూ ఆ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బాలాజీ నాయక్‌ మార్టూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ పర్చూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హైకోర్టును ఆశ్రయించారు.  తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరారు. 


రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారని ఆరోపణలు       
 
 కేసు నమోదు వెనుక రాజకీయ కారణాలున్నాయి. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏడేళ్ల లోపు జైలు శిక్షకు వీలున్నవే. అర్నేష్‌ కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పోలీసులు సీఆర్పీసీ సెక్షన్‌ 41(ఏ)కింద నోటీసులు ఇవ్వాలి. కానీ, ఇవ్వలేదు. మరోవైపు, ఈ నెల 5 నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాల్సి ఉంది. కానీ, ఈలోగానే   అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఏలూరి సాంబశివరావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 


నిబంధనలకు విరుద్ధంగా అరెస్టుకు ప్రయత్నాలు                                    


కేసులో కొందరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లే అయినా మేజిస్ట్రేట్‌ యాంత్రికంగా వారికి రిమాండ్‌ విధించారు. పర్చూరు నియోజకవర్గం పరిధిలో తప్పుడు సర్టిఫికెట్లతో ఓట్ల తొలగింపు కోసం గంపగుత్తగా ఫామ్‌-7 దాఖలు చేసిన వ్యవహారంలో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ తర్వాతే ఓట్ల తొలగింపులో భాగస్వాములైన వ్యక్తులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. కొందరు పోలీసులను సైతం సస్పెండ్‌ చేశారు అందుకే తనను ను వేధించాలనే ఏకైక ఉద్దేశంతో తప్పుడు కేసులో ఇరికించారని ఏలూరు సాంబశివరావు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.