AP Government Transferred IAS Officers: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి (CS Jawahar Reddy) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా సుమిత్ కుమార్ ను నియమించారు. ఆయన ప్రస్తుతం అల్లూరి జిల్లా కలెక్టర్ గా ఉన్నారు. ఇక, ప.గో జిల్లా కలెక్టర్ గా ఉన్న పి.ప్రశాంతిని అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ గా బదిలీ చేశారు. పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ గా ఉన్న ఎం.విజయ సునీత అల్లూరి సీతారామరాజు కలెక్టర్ గా బదిలీ అయ్యారు. ఇక, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్, ఎండీగా ఉన్న జి.వీరపాండ్యన్ కు డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే ఐఎఫ్‌ఎస్ అధికారి రాహూల్ పాండ్యేకు పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం.. ఆయన్ను జీఏడీలో రిపోర్టు చేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎన్నికల నేపథ్యంలో అధికారుల బదిలీ ప్రాధాన్యత సంతరించుకుంది.


Also Read: Chandrababu : రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ లేనట్లే - వైసీపీ నేతల చేరికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు