Andhra Pradesh Cyclone Montha Update: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను 'మొంథా' (Cyclone Montha)  తీరాన్ని తాకేందుకు దూసుకు వస్తోంది. . భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, ఈ తుపాను కాకినాడ, మచిలీపట్నం సమీపంలో రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది. . గాలి వేగం 80-90 కి.మీ/గంట  ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే  తీవ్ర తుపానుగా మారింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు, హై అలర్ట్ ప్రకటించారు. రెడ్ అలర్ట్‌లు జారీ చేస్తూ, 38 వేల మందిని లోతట్టు ప్రాంతాల నుంచి రిలీఫ్ క్యాంపులకు మార్చారు.

Continues below advertisement

ఈ తుపాను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. విశాఖపట్నం, కోనసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరంపై దాటిన తర్వాత, ఇది కొంత మందగించి ఒడిశా వైపు మళ్లుతుందని IMD ప్రకటించింది.  తుపాను ఆంధ్ర తీరాన్ని తాకిన తర్వాత ఒడిశాకు మళ్లుతుంది. అక్టోబర్ 31 వరకు పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురవచ్చు. 

IMD  హైదరాబాద్  సెంటర్ ప్రకారం  రాత్రి 8 గంటల  వరకు విపరీతమైన వర్షం కురుస్తుంది.  గాలి వేగం 90 కి.మీ/గంట వరకు పెరిగే అవకాశం. కాకినాడ, మచిలీపట్నం, కళింగపట్నం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ తుపాను 30 అసెంబ్లీ  నియోజకవర్గాలను  ప్రభావితం చేస్తుందని అధికారులు అంచనా.  

Continues below advertisement

 ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ   38,000 మందిని రిలీఫ్ క్యాంపులకు మార్చారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసులు, చిన్నారులు, వృద్ధులను ప్రాధాన్యతగా తీసుకున్నారు.  విశాఖపట్నం, విజయవాడ ఎయిర్‌పోర్టులు అక్టోబర్ 28 మొత్తం క్యాన్సల్ చేశాయి. ప్రయాణికులు ప్రభుత్వ ఆర్డర్‌ల ప్రకారం రీషెడ్యూల్ చేయాలని సూచించారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ వద్ద 43 ట్రైన్లు క్యాన్సల్. చెన్నై-హైదరాబాద్, ఒడిశా మార్గాల్లో డైవర్షన్లు ప్రకటించారు.  ఆంధ్ర, ఒడిశా తీరప్రాంతాల్లో స్కూల్స్, కాలేజీలు మూసివేశారు. ఎమర్జెన్సీ స్టాఫ్‌కు హాలిడేలు క్యాన్సల్ చేశారు.    

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ఎమర్జెన్సీ మీటింగ్‌లు నిర్వహించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్  10 బృందాలు ఆంధ్రలో, 8 ఒడిశాలో మోహరించారు. రాష్ట్ర వైఆర్ డిపార్ట్‌మెంట్ రెస్క్యూ ఆపరేషన్లు ప్రారంభించింది. "ప్రజలు ఇంటి లోపలే ఉండాలి. హెల్ప్‌లైన్ 1070కు కాల్ చేయండి" అని APSDMA సలహా ఇచ్చింది.