AP News in Telugu: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఇప్పటికే పలువురు అధికారులు సెలవులపై వెళ్లగా ఇప్పుడు సీఎస్‌ జవహర్‌ రెడ్డి కూడా సెలవుపై వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులకు సమాచారం ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా త్వరలో ప్రమాణం చేయనున్న చంద్రబాబును బుధవారం కలిసిన సీఎస్‌ జవహార్‌ రెడ్డి ఈ విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోందీ.