8th Class Student Drew A Portrait Of CM Chandrababu: ఓ విద్యార్థిని సీఎం చంద్రబాబుపై (CM Chandrababu) అభిమానంతో ఆయన చిత్ర పటాన్ని అద్భుతంగా గీసింది. అనంతరం నేరుగా ఆయన్ను కలిసి తీపి జ్ఞాపికను అందించింది. దీన్ని చూసిన ముఖ్యమంత్రి మురిసిపోయారు. విద్యార్థినిని అభినందించారు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ (Vijayawada) పటమటలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థిని లాస్యకు సీఎం చంద్రబాబు అంటే అంతులేని అభిమానం. ఈ క్రమంలో తన స్వహస్తాలతో ఆయన చిత్రపటాన్ని అద్భుతంగా గీసింది. అంతేకాకుండా 'సంపద సృష్టించి పేదవారికి పంచి ఇచ్చే పెన్నిధికి ఒక పేద విద్యార్ధి ఇచ్చే చిరుజ్ఞాపిక' అటూ చిత్రంపై రాసింది. దీన్ని తీసుకుని సోమవారం సచివాలయానికి వచ్చింది. 

Continues below advertisement




మురిసిపోయిన సీఎం


ఈ చిత్రాన్ని విద్యార్థిని లాస్య సీఎం చంద్రబాబును నేరుగా కలిసి అందజేసింది. చిన్నారి అభిమానం, ఆమె ప్రతిభకు ఆయన మురిసిపోతూ విద్యార్థినిని అభినందించారు. బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని ఆకాంక్షించారు.


Also Read: Free Gas Cylinders: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు, బుకింగ్ ప్రాసెస్ ఇలా!