Oasis Janani Yatra:ఫెర్టిలిటీ సంరక్షణపై అవగాహన, సమర్థవంతమైన చికిత్సలను గ్రామీణ ప్రాంతాలకు చేరవేసేందుకు ఒయాసిస్ ఫెర్టిలిటీ చేపట్టిన 'జననీ యాత్ర' గుంటూరుకు చేరుకుంది. ఈ యాత్రలో భాగంగా గుంటూరులోనే ఉచిత క్యాంప్‌ను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఈ కార్యక్రమాన్ని గుంటూరు ఎమ్మెల్యే  మొహమ్మద్ నసీర్ అహ్మద్ ప్రారంభించారు.

ఈ సమయంలో Oasis చొరవ ప్రశంసనీయం: ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్  

ఈ ఉచిత ఫెర్టిలిటీ శిబిరంలో మాట్లాడిన ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనాభా తగ్గుదలపై హెచ్చరికలు చేస్తున్నారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రోత్సాహకాలు ఇస్తున్నారు ఈ టైంలో ఈ యాత్ర ఒక ప్రధాన పరిష్కార మార్గం. రాష్ట్రంలో జనన రేటు 1.7కి తగ్గింది. ఇది భవిష్యత్తులో సామాజిక-ఆర్థిక సవాళ్లకు కారణమవుతుంది. ప్రతి కుటుంబం కనీసం ఇద్దరు పిల్లలను కలిగి ఉండాలని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, ఫెర్టిలిటీ సమస్యలు గుర్తించడం, సరైన ఆహారం, జీవనశైలి మార్పులు, వైద్య సహాయం అవసరం. ఈ క్యాంప్‌లు ఆ అవసరాన్ని తీరుస్తాయి. ఇన్‌ఫెర్టిలిటీ ని ఒక సామాజిక రుగ్మతగా కాకుండా వైద్యపరమైన సవాలుగా చూడాలి. ఈ యాత్ర ద్వారా అనేక కుటుంబాలకు ఆశ తీరుతుందనినమ్ముతున్నాను. ప్రతి గ్రామంలోనూ ఇలాంటి సేవలు అందుబాటులో ఉండాలని కోరుకుంటూ, అని అన్నారు.  

దంపతుల్లో ఆత్మ విశ్వాసం పెంచుతున్నాం: డాక్టర్ కృష్ణ చైతన్య 

కార్యక్రమంలో ఒయాసిస్ ఫెర్టిలిటీ సైంటిఫిక్ హెడ్ డాక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ... "టైర్-2, 3 పట్టణాల్లో అవగాహన లోపం ఆలస్య చికిత్సకు దారితీస్తుంది. జననీ యాత్ర ద్వారా ప్రత్యేక సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నాం. ఇది చికిత్స మాత్రమే కాదు దంపతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయాణం." అని తెలిపారు. 

ముందే మేల్కొంటేనే మంచిది:డాక్టర్ రమ్య  

ఒయాసిస్ ఫెర్టిలిటీ క్లినికల్ హెడ్ డాక్టర్ రమ్య  మాట్లాడుతూ... "సంతానలేమి ఇప్పుడు కేవలం వైద్య సమస్య కాదు. జీవనశైలి సవాల్. సత్వర నిర్ధారణ, నిపుణుల సలహాలతో ప్రతి  జంట  వద్దకు సేవలు చేరువ చేస్తున్నాం. సంతానలేమిని ఇకపై రహస్యంగా పెట్టుకోకూడదు. ప్రతి జంటకు సమయానికి నిపుణుల మార్గదర్శకత్వం అవసరం. ఈ క్యాంప్‌ల ద్వారా మేం జంటలతో ప్రత్యక్షంగా కనెక్ట్ అవుతూ, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాం. సమాజంలోని అపోహలను సైన్స్ ద్వారా తొలగిస్తున్నాం అని అన్నారు. 

అన్ని జిల్లాల్లో క్యాంపులు

జూన్ 2025 లోపు రెండు రాష్ట్రాల్లో 30 జిల్లాలను కవర్ చేసేలా ఈ యాత్ర చేపడుతున్నారు. ప్రతి క్యాంప్‌లో సురక్షితమైన శాంపుల్ కలెక్షన్, డిజిటల్ డయాగ్నస్టిక్ సదుపాయాలతో సమర్థవంతమైన చికిత్సలు అందిస్తున్నారు. ఆలస్యం చేయకండి – సమయానికి అవగాహన, చర్యలే జంటల సంతాన సాఫల్యానికి మూలాలు అని ఒయాసిస్ ఫెర్టిలిటీ ప్రతినిధులు పిలుపునిస్తున్నారు.

ఒయాసిస్ ఫెర్టిలిటీ గురించి2009లో ఏర్పాటైన ఈ సంస్థ, భారతదేశంలో 19 నగరాల్లో 31 కేంద్రాలతో సేవలు అందిస్తోంది. 1,00,000+ శిశువుల జననంలో కీలక పాత్ర పోషించింది. ఐవీఎఫ్, ఐయూఐ వంటి అధునాతన చికిత్సలతోపాటు సమగ్ర ఫెర్టిలిటీ సేవలను అందిస్తుంది.