Earthquake in Prakasam District | ఒంగోలు: ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. ప్రకాశం జిల్లా ముండ్లమూరు పరిసర ప్రాంతాల్లో కొన్ని సెకన్లపాటు స్వల్పంగా భూమి కంపించింది. ఆదివారం అర్ధరాత్రి 12.47గంటల సమయంలో భూమి కంపించింది. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు ప్రాణ భయంతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. దాదాపు నాలుగు సెకండ్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. మే నెలలోనూ ఏపీలో పలుమార్లు భూకంపం సంభవించింది.