CM YS Jagan: జగనన్న విద్యాదీవెన (Jagananna Vidya Deevena), జగనన్న వసతి దీవెన (Jagananna Vasathi Deevena) పథకాలకి సంబంధించి నిధులను ముఖ్యమంత్రి జగన్ (CM YS Jagan) విడుదల చేశారు. జగనన్న విద్యాదీవెన పథకం (Jagananna Vidya Deevena) కింద విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ కానున్నాయి. అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి నిధులను ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) బటన్ నొక్కి డబ్బు విడుదల చేశారు. 10.82 లక్షల విద్యార్థులకు లబ్ధి కలగనుండగా, మొత్తం రూ.709 కోట్లను విడుదల చేశారు. ఇప్పటి వరకూ 9,274 కోట్లను చెల్లించారు.


ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. చదువు అనేది ఎవరూ దొంగిలించలేని ఆస్తి అని అన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు ఎంతో సంతోషాన్ని ఇచ్చే పథకాలని కొనియాడారు. చదువుతో జీవన స్థితి గతుల్లో కూడా మార్పు వస్తుందని అన్నారు. జగనన్న విద్యా దీవెన కింద 10.82 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్య ద్వారా నాణ్యమైన జీవితం సాకారమవుతుందని సీఎం జగన్ (CM Jagan) అన్నారు.


‘‘జగనన్న విద్యా దీవెన దేశంలో ఎక్కడా లేనట్లుగా అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు రీఎంబర్స్ చేసే పథకం. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి కోర్సులు చదివే పేద విద్యార్థులు వారి కాలేజీలకు చెల్లించాల్సిన మొత్తం ఫీజును ప్రతి త్రైమాసికానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద ఇప్పటిదాకా 9,274 కోట్లు చెల్లించింది. అప్పటి టీడీపీ (TDP) ప్రభుత్వం పెట్టిన ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు కేవలం రూ.1,778 కోట్లు జగన్ ప్రభుత్వమే చెల్లించింది’’ అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.