జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడంపై పలువురు స్పందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తప్పుపట్టారు. నిన్నటి నుంచి మనసులో వేదన కలిస్తోందన్న ఆయన, బాధ కలిగిస్తోందన్నారు. ఇప్పుడు మాట్లాడకపోతే తన బతుకు ఎందుకని, చిరాకు కలిగిస్తోందన్నారు. తనకు ఇష్టమైన, దైవ సమానుడైన పవన్ కల్యాణ్ గురించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారని అన్నారు. మీరు పెద్ద హోదాలో ఉన్నారని, భగవంతుడు మీకు అద్భుతమైన పొజిషన్ ఇచ్చాడని గుర్తు చేశారు. దశాబ్దాలుగా పవన్ కల్యాణ్ తో తిరుగుతున్నానని, ఆయన చాలా నిజాయితీ పరుడని, నీతిమంతుడని బండ్ల గణేష్ గుర్తు చేశారు.


భోళా మనిషి పవన్ కల్యాణ్


ఎవరు కష్టాల్లో ఉన్నా ముందుకెళ్లే వ్యక్తి, భోళా మనిషి పవన్ కల్యాణ్ అని అన్నారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారని, కొన్ని ఆయనకు తెలియకుండా జరిగిపోయాయని అన్నారు. పవన్ కల్యాణ్ సమాజానికి ఉపయోగపడే వ్యక్తని, దేశం కోసం బతుకుతున్న వ్యక్తని కొనియాడారు. స్వార్థం కోసం, స్వలాభం కోసం ఎవరితోనూ ఆయన ఎవరతోనూ మాట్లాడలేదన్నారు. షూటింగ్ లు చేసుకోమని, హాయిగా బతకమని చెప్పేవాడినన్నారు. మనం చచ్చిపోయినా జనం గుర్తు పెట్టుకోవాలని, జనానికి ఏదో చేయాలని తరిపించే వ్యక్తి పవన్ కల్యాణ్ అన్నారు. నిస్వార్థంగా జనం కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారన్న బండ్ల గణేష్, ఆయన సంపాదించిన సొమ్మును పార్టీ కోసం ఖర్చు చేస్తున్నారని అన్నారు. పవన్ కల్యాణ్ కు కులపిచ్చి ఉంటే తనను నిర్మాతను చేసే వాడా అని ప్రశ్నించారు. తాను అనుభవిస్తున్న ఈ హోదా మొత్తం పవన్ కల్యాణ్ పెట్టిన భిక్షేనన్నారు. పవన్ కల్యాణ్ లాంటి మంచి వ్యక్తిని అబాండాలు వేయవద్దని బండ్ల గణేష్ కోరారు. 


Bandla Ganesh reacts to AP CM Jagan's comments against the personal life of Pawankalyan. pic.twitter.com/YXIGfgqn1h


— Satya (@YoursSatya) October 13, 2023