Parliament coordinators for Telangana: న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. మరికొన్ని నెలల్లో జరగనున్న ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న ఏఐసీసీ (AICC) దూకుడు పెంచింది. దేశంలోని పలు రాష్ట్రాలకు పార్లమెంట్ కోఆర్డినేటర్లను నియమించింది ఏఐసీసీ. సీనియర్ నేతలకు లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections 2024) బాధ్యతలు అప్పగిస్తూ వారిని ఎంపీ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లుగా నియమించింది.
తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు కోఆర్డినేటర్లుగా రాష్ట్ర మంత్రులు, సీనియర్ నేతలను ఏఐసీసీ నియమించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మహబూబ్ నగర్, చేవెళ్ల బాధ్యలు అప్పగించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సికింద్రాబాద్, హైదరాబాద్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మహబూబాబాద్, ఖమ్మం లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ కో ఆర్డినేటర్లుగా నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఇదివరకే తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఛైర్మన్గా సీఎం రేవంత్రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. దేశ వ్యాప్తంగా జరగనున్న లోక్ సభ ఎన్నికలు మూడు నెలల్లో జరగనుండడంతో కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాలకు ఎన్నికల కమిటీలను నియమించింది.
తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు పార్లమెంట్ కోఆర్డినేటర్లు వీరే..1. ఆదిలాబాద్ (ఎస్టీ) - డి. అనసూయ (సీతక్క)2. పెద్దపల్లి (ఎస్సీ) - డి. శ్రీధర్ బాబు3. కరీంనగర్ - పొన్నం ప్రభాకర్4. నిజామాబాద్ - టి.జీవన్ రెడ్డి5. జహీరాబాద్ - పి.సుదర్శన్ రెడ్డి6 మెదక్ - దామోదర రాజనరసింహ7. మల్కాజిగిరి - తుమ్మల నాగేశ్వరరావు8 సికింద్రాబాద్ - భట్టి విక్రమార్క మల్లు9. హైదరాబాద్ - భట్టి విక్రమార్క మల్లు10. చేవెళ్ల - రేవంత్ రెడ్డి11. మహబూబ్ నగర్ - రేవంత్ రెడ్డి12. నాగర్ కర్నూల్ (ఎస్సీ) - జూపల్లి కృష్ణారావు13. నల్గొండ - ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి14. భువనగిరి - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి15. వరంగల్ (ఎస్సీ) - కొండా సురేఖ16. మహబూబాబాద్ (ఎస్టీ) - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి17. ఖమ్మం - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఏపీలో లోక్ సభ స్థానాలకు కోఆర్డినేటర్ల నియామకం..ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తాయని చెబుతున్న ఏఐసీసీ.. లోక్ సభ ఎన్నికల్లో సాధ్యమైనన్ని సీట్లు గెలుపొందాలని భావిస్తోంది. రాష్ట్రంలోని 25 లోక్ సభ స్థానాలకుగానూ కాంగ్రెస్ అధిష్టానం కోఆర్డినేటర్లుగా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్ నేతలకు పార్లమెంట్ గెలుపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఏఐసీసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఏపీలో లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లు వీరే1 అరకు - (ఎస్టీ) జగతా శ్రీనివాస్2 శ్రీకాకుళం - మీసాల సుబ్బన్న3 విజయనగరం - బొడ్డేపల్లి సత్యవతి4 విశాఖపట్నం - కొత్తూరి శ్రీనివాస్5 అనకాపల్లి - సనపాల అన్నాజీరావు6 కాకినాడ - కే.బీ.ఆర్. నాయుడు7 అమలాపురం - (ఎస్సీ) ఎం. వెంకట శివ ప్రసాద్8 రాజమండ్రి - ముషిని రామకృష్ణ9 నరసాపురం - జెట్టి గురునాధరావు10 ఏలూరు - కనుమూరి బాపి రాజు11 మచిలీపట్నం - కొరివి వినయ్ కుమార్12 విజయవాడ - డి.మురళీ మోహన్ రావు13 గుంటూరు - గంగిశెట్టి ఉమాశంకర్14 నరసరావుపేట - వి.గురునాధం15 బాపట్ల - (ఎస్సీ) శ్రీపతి ప్రకాశం16 ఒంగోలు - యు.వెంకటరావు యాదవ్17 నంద్యాల - బండి జకారియా18 కర్నూలు - పి.ఎం. కమలమ్మ19 అనంతపురం - ఎన్ శ్రీహరి ప్రసాద్20 హిందూపూర్ - షేక్ సత్తార్21 కడప - ఎం. సుధాకర్ బాబు22 నెల్లూరు - ఎం.రాజేశ్వరరావు23 తిరుపతి (ఎస్సీ) - షేక్ నాజర్ అహమ్మద్24 రాజంపేట - డా. ఎన్. తులసి రెడ్డి25 చిత్తూరు - (ఎస్సీ) డి. రాంభూపాల్ రెడ్డి
దేశ వ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ కోఆర్డినేటర్ల జాబితా