Strange Bet In Kurnool District: స్నేహితులతో సరదాగా చాలా మంది పందెం కాయడం మనం చూసుంటాం. కొన్ని సరదాగా ఉంటే.. మరికొన్ని ప్రాణాల మీదకు తెస్తాయి. కర్నూలు జిల్లాలో (Kurnool District) తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. బతికున్న చేపను తినాలని పందెం కాయగా.. అలానే చేసిన ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్దుర్తి మండలం బోగోలులో వెంకటస్వామి అనే వ్యక్తితో అతని స్నేహితుడు సరదాగా బతికున్న చేపను తినగలవా అని పందెం కాశాడు. దీంతో అలానే చేస్తానంటూ వెంకటస్వామి బతికున్న చేపను మింగడంతో అది గొంతులో చిక్కుకుని అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతన్ని సన్నిహితులు ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చేపను బయటకు తీశారు. ఇటీవల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 


Also Read: Vijayawada News: అర్ధరాత్రి బాలిక ఇంటికి వెళ్లిన యువకుడు - బలవంతంగా పెళ్లి చేసేశారు, ఎక్కడంటే?