AP SSC Exam Results 2026: గురువారం ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల! రిజిల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్ ఇదే!

AP SSC Exam Results 2026: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయ.

AP Board Result Dates

AP SSC Exam Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురు చూస్తున్న ఏపీ ఎస్‌ఎస్‌సీ ఫలితాలు ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. మీ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. 

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6.4 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 6,22,074 మంది రెగ్యులర్‌ విద్యార్థులు కాగా, 18,842 మంది ప్రైవేటు కేటగిరిలో పరీక్షలు రాశారు. బాలురు సంఖ్య 3,28,652 ఉండగా, బాలికల సంఖ్య 3,12,264గా నమోదైంది. 

ఫలితాలు ఎక్కడ చూసుకోవాలి

ఫలితాల విడుదలైన తర్వాత ఏబీపీ దేశం సహా పలు వెబ్‌సైట్‌లో ఫలితాలు పోస్టు చేస్తారు. 

ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లో ఫలితాలు https://telugu.abplive.com/ లింక్‌లో ఉంటాయి. 

దీంతోపాటు అధికారికంగా ప్రభుత్వం నిర్వహించే సైట్లలో కూడా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. bse.ap.gov.in

results.bse.ap.gov.in

examresults.ap.nic.in

ఈ వెబ్‌సైట్‌లతోపాటు డిజిలాకర్ ద్వారా విద్యార్థులు తమ డిజిటల్ మార్కుల మెమోను డౌన్‌లోడు చేసుకోవచ్చు. దీని కోసం అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఉపయోగించాలి. 

వాట్సాప్ సేవలు 

ప్రభుత్వం వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను అందిస్తోంది. 9552300009 అనే నెంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేస్తే ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. 

ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా ఫలితాలు 

ఇంటర్నెట్ సౌకర్యం లేని వారి కోసం ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. "SSC <Hall Ticket Number>" టైప్ చేసి 55352 లేదా 56300 కు పంపాల్సి ఉంటుంది. 

గత ఏడాది ఫలితాలు చూస్తే... 

2025లో ఏపీ పదో తరగతి ఫలితాల్లో మొత్తం 81.14 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఎప్పటిలాగే బాలికలు పై చేయి సాధించారు. జిల్లాల వారీగా చూస్తే పార్వతీపురం మన్యం జిల్లా 93.90 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. 

రీ వెరిఫికేషన్, సప్లిమెంటరీ పరీక్షలు 

వచ్చిన మార్కులపై అసంతృప్తి ఉన్న విద్యార్థులు రీ కౌంటింగ్‌ లేదా రీ వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఒక వేళ ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం మే నెలాఖరు నుంచి ప్రభుత్వం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనుంది. దీని వల్ల సంవత్సరం వృథా కాకుండా చూసుకోవచ్చు. AP SSC Results 2025: ఈ ఏడాది 6,19,275 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. ఫలితాలను ఆన్ లైన్, వాట్సాప్ లో అప్ లోడ్ చేసి విద్యార్ధులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ ఫలితాలు విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ తో పాటు వాట్సాప్ లోనూ అందుబాటులో ఉంటాయి. దీంతో వెబ్ సైట్ తో పాటు వాట్సాప్ లో ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలో అధికారులు వివరాలు వెల్లడించారు. అభ్యర్థులకు ఫలితాల కోసం వాట్సాప్ లో 9552300009 నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపి, విద్యా సేవలు ఎంచుకుని, ఆపై టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, వారి రోల్ నంబర్‌ ద్వారా ఫలితాల PDF కాపీని పొందవచ్చు.

Sponsored Links by Taboola