Rythu Bharosa Funds Release Date 2026: తెలంగాణలోని రైతులు ఆశగా ఎదురు చూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది. వానా కాలంలో సాగు సీజన్  ప్రారంభమై, ముసురు అందుకుంటున్న వేళ పెట్టుబడి సాయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న రైతులకు రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఫైనల్ చేసింది. ఈ నెల 30 నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. 

Continues below advertisement

ఈసారి నిధుల పంపిణీకి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గమైన మధిర నియోజకవర్గాన్ని వేదికగా మార్చుకున్నారు. జూన్ 30న మధిరలో నిర్వహించేబోయే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి స్వయంగా ఈ నిధుల పంపిణీ ప్రారంభిస్తారు. ఒక్క రోజులో కాకుండా ఎలాంటి టెక్నిలక్ గ్లిచెస్ లేకుండా ఉండేందుకు వరుసగా 9 రోజుల పాటు ఈ నగదు జమ ప్రక్రియ కొనసాగుతుంది. 

గత ప్రభుత్వం హయాంలో రైతు బంధు పేరిట కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, మైనింగ్ జోన్లు వంటి వ్యవసాయేతర భూములకు వందల కోట్లు చెల్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ లూప్ హోల్స్‌కు పూర్తిగా అడ్డుకట్ట వేస్తూ ప్రస్తుత ప్రభుత్వం సరికొత్త రూల్స్ తీసుకొచ్చింది. కేవలం సాగు భూములు కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఈ రూపాయి చేరాలని గట్టిగా సంకల్పించింది. ఇందు కోసం నిర్వహించిన క్షేత్రస్థాయి ధ్రువీకరణలో దాదాపు 15 లక్షల ఎకరాల సాగుకు యోగ్యం కాని భూములను లిస్ట్ నుంచి తొలగించింది. 

Continues below advertisement

వరుసగా 9 రోజులు ఫండ్స్ రిలీజ్ 

ఒకేసారి 73 లక్ష మంది అకౌంట్స్‌లోకి దాదాపు 9వేల కోట్లకు పైగా నిధులను పంపిణీ చేయడం బ్యాంకింగ్ సర్వర్లపై తీవ్రమైన లోడ్‌ను క్రియేట్ చేస్తుంది. అందుకే రేవంత్ సర్కారు అత్యంత ప్లాన్డ్‌గా సక్సెసివ్ ఫేజ్‌లలో నిధులను రిలీజ్ చేస్తోంది. ఈ డిస్బర్స్‌మెంట్‌ స్ట్రాటజీ పూర్తిగా బాటమ్ అప్ అప్రోచ్‌లో సాగనుంది. మొదటి ఫేజ్‌ ఎకరం లోపు భూమి ఉన్న అత్యంత పేద చిన్న సన్నకారు రైతులు ఫస్ట్ ప్రయార్టీ ఇస్తారు. రెండో ఫేజ్‌ లో రెండు ఎకరాలు, మూడు ఎకరాలు ఇలా భూమి విస్తీర్ణం పెరిగే క్రమంలో పెద్దరైతులకు ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేస్తారు. 

మధిర సభలో అగ్రీ రోడ్‌ మ్యాప్ విడుదల

మధిర సభలో కేవలం ఫండ్స్ రిలీజ్ మాత్రమే కాకుండా అగ్రికల్చర్ కాన్‌క్లేవ్‌లా ప్రభుత్వం చేస్తోంది. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం ఏర్పాటు చేసిన హైలెవల్ సమన్వయ కమిటీ తన రిపోర్ట్‌ను సీఎంకు అందజేసింది. క్వాలిటీ సీడ్స్, సప్లై, క్రాప్ డైవర్సిఫికేషన్ వంటి అంశాలపై ముఖ్యమంత్రి సభలో కీలక ప్రకటన చేస్తారు. 

రైతులు తమ బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన ఆధార సీడింగ్, ఈకేవైసీ స్టేటస్ పక్కాగా ఉందో లేదో చూసుకోవాలి. లేకుంటే యాక్టివ్ చేసుకోవాలి. మీ అకౌంట్ హోల్డ్‌లో ఉంటే వెంటనే లోకల్ అగ్రికల్చర్ ఆఫీసర్‌ను సంప్రదించండి. వరి సాగు చేసే రైతులకు క్వింటాల్‌కు  500 రూపాయల బోనస్ కావాలంటే మార్కెట్ యార్డ్ రశీదులను డిజిటల్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడం మర్చిపోవద్దు.