గౌతమ్ గంభీర్‌ నేడు 41వ వసంతంలోకి అడుగుపెట్టాడు.

అతడికి మాజీ క్రికెటర్లు, అభిమానులు బర్త్‌డే విషెస్‌ చెప్పారు.

ఎలా చూసినా నువ్వో ఛాంపియన్‌ అంటూ యువీ పొగిడేశాడు.

మంచి హ్యూమన్‌ బీయింగ్‌ అంటూ రైనా ప్రశంసించాడు.

2018లో గంభీర్‌ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్‌ అయ్యాడు.

టీమ్‌ఇండియా 2011, 2007 ప్రపంచకప్‌లు గెలవడంలో గౌతీ పాత్ర కీలకం.

2007 ఫైనల్లో పాక్‌పై గౌతీ 75 పరుగులు కొట్టాడు.

2011 ఫైనల్లో శ్రీలంకపై 97 పరుగుల సాధించాడు.

రొటేషన్‌ పద్ధతిలో తక్కువ అవకాశాలే దొరికినా గౌతీ రాణించాడు.

ప్రస్తుతం మెంటారింగ్‌, రాజకీయాలు, సామాజిక సేవలో బిజీగా ఉన్నాడు.