మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి

మహబూబాబాద్ జిల్లాలో గ్రానైట్ బండరాయి పడి నలుగురు కూలీలు మృతి చెందారు.

లారీలో తరలిస్తున్న గ్రానైడ్ రాయి ఆటోపై పడి ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది

కురవి మండలంలోని అయ్యగారి పల్లి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

మృతులు చిన్న గూడూరు మండలంలోని జయ్యారం వాసులుగా గుర్తించారు.

కూలి పనుల కోసం వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

క్రేన్‌ సహాయంతో బండరాళ్లను తొలగించి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు

గాయపడ్డ నలుగురికి మహబూబాబాద్‌ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఘటనపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Thanks for Reading. UP NEXT

Viral Video: మంత్రి ఎర్రబెల్లి చేపల వేట ట్రెండింగ్

View next story