జనంతో ఇట్టే కలిసిపోయే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం ఓ సరదా పనిచేశారు.

పాలకుర్తి నియోజకవర్గ పర్యటన అనంతరం మంత్రి ఎర్రబెల్లి వరంగల్ కు వెళ్తున్నారు.

దారిలో కొంతమంది చేపలు పడుతూ కనిపించారు. వెంటనే మంత్రి కాన్వాయ్ ఆగింది.

వాహనం దిగిన మంత్రి ఎర్రబెల్లి చేపలు పడుతున్న వాళ్ల దగ్గరకు వెళ్లారు.

వారిలో ఒకరి నుంచి గాలం తీసుకుని, కర్రను పట్టి మంత్రి చేపల వేట మొదలుపెట్టారు.

చేపల వేట ఉమ్మడి రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు

కేసీఆర్ సీఎం అయ్యాక చెరువులలో నీరు సమృద్ధిగా చేరాయన్నారు.

ప్రభుత్వం చెరువుల్లో కోట్ల కొలది చేపలను ఉచితంగా వేస్తుందన్నారు.

ఇప్పుడు ఎక్కడ చూసినా చేపలే కనిపిస్తున్నాయని చెప్పారు.

మొత్తానికి మంత్రి ఎర్రబెల్లి చేపల వేట వీడియో వైరల్ గా మారింది