పూజా హెగ్డే ప్రస్తుతం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉంది.

ఇందులో సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్‌గా పూజా నటిస్తుంది.

ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీన విడుదల కానుంది.

గతేడాది పూజా హెగ్డే ఐదు సినిమాల్లో నటించింది.

ఇందులో ‘ఎఫ్3’ తప్ప మిగతా సినిమాలు అన్నీ భారీ డిజాస్టర్లుగా నిలిచాయి.

తెలుగులో ప్రతి సంవత్సరం కచ్చితంగా ఒక పెద్ద సినిమాలో పూజా కనిపిస్తుంది.

వచ్చే ఏడాది మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల సినిమాలో కనిపించనుంది.

త్రివిక్రమ్‌, పూజాల కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా.

మహేష్ బాబు, పూజా హెగ్డేల కాంబినేషన్‌లో ఇది రెండో సినిమా.