ఆగ్రాలోని ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్మహల్ ఇప్పుడు ఒక సినిమా కారణంగా చర్చల్లో నిలిచింది
ప్రముఖ నటుడు పరేశ్ రావల్ నటించిన 'ద తాజ్ స్టోరీ' సినిమా వివాదం చెలరేగింది.
ఈ సినిమాలో తాజ్ మహల్ లో నిర్మించిన 22 గదుల రహస్యం గురించి తెరపైకి వచ్చింది
అయితే ఆగ్రా లోని తాజ్ మహల్ ను నిర్మించడానికి ఎంత ఖర్చు అయిందో మీకు తెలుసా..
కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, తాజ్ మహల్ అప్పటి కాలంలో దాదాపు 32 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించారు
దాని విలువ నేటి కాలంలో బిలియన్ల రూపాయలకు సమానంగా ఉంటుంది
తాజ్ మహల్ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1632 నుండి 1653 మధ్య నిర్మించారని తెలిసిందే
అరుదైన కట్టడం తాజ్ మహల్ నిర్మాణంలో దాదాపు 20 వేల మంది కళాకారులు, కార్మికులు పనిచేశారు
అప్పట్లో దీని కోసం వెచ్చించిన మొత్తం ఖర్చుతో ఒక అద్భుత నగరాన్ని నిర్మించవచ్చు
2025లో ద్రవ్యోల్బణం ప్రకారం చూస్తే తాజ్ మహల్ ధర 9 వేల 5 వందల కోట్లకు పైమాటే అని నిపుణుల అభిప్రాయం