Rains: పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను వాగు దాటించిన యువకులు
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాత ముగ్దుంపురం సమీపంలో లో లెవెల్ బ్రిడ్జి వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆటో లో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను అక్కడ ఉన్న యువకులు వాగు దాటించి.. నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి.. తమ మానవత్వాన్ని చాటుకున్నారు.