Sabitha Indra Reddy: ఆ విషాదాన్ని మరువొద్దు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సబిత

Continues below advertisement

గులాబ్ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు అప్ప చెరువు వాగు పొంగిపోర్లుతోంది. శంషాబాద్ కు రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. గత ఏడాది అక్టోబర్ నెలలో కురిసిన భారీ వర్షానికి అప్ప చెరువు కట్ట తెగిందన్నారు. వరద తాకిడికి ఏడుగురు మృతి చెందారని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆ విషాదాన్ని మరువొద్దని అప్రమత్తం చేశారు. అలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని అధికారులను ఆమె ఆదేశించారు. చెరువుల లింకప్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్ల రూపాయల కేటాయించినట్లు తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram