Sabitha Indra Reddy: ఆ విషాదాన్ని మరువొద్దు.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సబిత

గులాబ్ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు అప్ప చెరువు వాగు పొంగిపోర్లుతోంది. శంషాబాద్ కు రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. గత ఏడాది అక్టోబర్ నెలలో కురిసిన భారీ వర్షానికి అప్ప చెరువు కట్ట తెగిందన్నారు. వరద తాకిడికి ఏడుగురు మృతి చెందారని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆ విషాదాన్ని మరువొద్దని అప్రమత్తం చేశారు. అలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని అధికారులను ఆమె ఆదేశించారు. చెరువుల లింకప్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్ల రూపాయల కేటాయించినట్లు తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola