Anthrax: గొర్రెలు ఆంత్రాక్స్తోనే మృతి చెందినట్లు వైద్యుల నిర్దారణ
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చాపలబండ గ్రామంలో మృతి చెందిన గొర్రెలకు ఆంత్రాక్స్ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. గొర్రెలు ఆంత్రాక్స్తోనే మృతి చెందినట్లు పరీక్షల్లో వెల్లడైంది. అప్రమత్తమైన అధికారులు చాపలబండతో పాటు పరిసర గ్రామాల్లోని గొర్రెలు, మేకలకు టీకాలు వేయడానికి చర్యలు చేపట్టారు. ఇందుకోసం బెంగళూరు నుంచి 8 వేల డోసుల ఆంత్రాక్స్ నివారణ టీకాలు గురువారం వరంగల్కు చేరుకున్నాయని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డా.బాలకృష్ణ తెలిపారు.