Kishan Reddy: శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ.సుబ్బారెడ్డి సహా ఇతర అధికారులు కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా తగ్గుముఖం పట్టాలని స్వామివారిని ప్రార్థించినట్టు కిషన్ రెడ్డి చెప్పారు.