Tiger Fear in Jayashankar Bhupalpally : ముకునూరు, కిష్టాపురం అటవీప్రాంతంలో పులి | DNN | ABP Desam
ABP Desam
Updated at:
28 Aug 2022 10:59 PM (IST)
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఓ ఎద్దుపై దాడి చేసి పులి చంపేసినట్లు స్థానికులు అటవీశాఖ అధికారులకు సమచారం అందించారు. ముకునూరు, కిష్టాపురం అటవీ ప్రాంతంలో పులి కదలికలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గతంలోనూ ఇదే తరహాలో అటవీ ప్రాంతం నుంచి పులి బయటకు వచ్చిందంటున్న స్థానికులు...అప్పుడు కూడా ఇలానే మూగజీవాలపై దాడి చేసిందని అంటున్నారు.