Congress Tulasi Reddy : విద్యార్ది నాయకుడి నుండి గవర్నర్ స్దాయికి మాటలు కాదు | ABP Desam

మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య మృతి బాధాకరం అని కాంగ్రెస్ పార్టీ ఎపి పిసిసి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసి రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కడప జిల్లా వేంపల్లె లోని ఆయన స్వగృహంలో తులసిరెడ్డి దంపతులు,రోశయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోశయ్య మృతి బాధాకరమన్నారు. రోశయ్య పరిపాలనాదక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా పేరుప్రఖ్యాతులు గడించారన్నారు. విద్యార్థి సంఘ నాయకుడి నుంచి గవర్నర్ స్థాయికి అంచలంచెలుగా ఎదిగారని తెలిపారు. వివాదరహితుడిగా నిలిచారన్నారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola