కేసీఆర్ అవినీతి రాజకీయాలు చేస్తున్నారు: రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నాగోబా ఆలయాన్ని PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, MLA సీతక్క సందర్శించి పూజలు చేశారు. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు.... ప్రపంచం గర్వించేలా ఉంటాయన్నారు. ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ నిర్వహించిన సభను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మంచిర్యాలలో మాట్లాడిన రేవంత్.... కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వంలో మంచిర్యాల మొదటి స్థానంలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం జరిగిన మాట వాస్తవమే కానీ... రానున్న ఎన్నికల్లో పూర్తి మెజార్టీ సాధిస్తామన్నారు. KCR అవినీతి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola