Rajagopal Reddy Fires On Police: KTR ఏమైనా ముఖ్యమంత్రా..? పోలీసులపై రాజగోపాల్ రెడ్డి ఫైర్
మునుగోడు ఉపఎన్నికలలో ప్రచారం కోసం.. అక్టోబర్ 23 ఆదివారం రాత్రి కేటీఆర్ చౌటుప్పల్ నుంచి గట్టుప్పల్ వెళ్లారు. ఆ క్రమంలో.. టీఆర్ఎస్ శ్రేణులు భారీగా కదిలి రావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అదే సమయంలో అటువైపుగా వస్తున్న రాజగోపాల్ రెడ్డి... ట్రాఫిక్ లో అంబులెన్స్ చిక్కుకుపోయిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. కేటీఆర్ కోసం అంబులెన్స్ ఆపారంటూ ఆయన ఆరోపించారు. కానీ పోలీసులు మాత్రం తాము వాటిని గమనించలేదని చెప్పారు. దీంతో.. పోలీసు అధికారులకు, రాజగోపాల్ రెడ్డికి మధ్య కాస్త వాగ్వాదం జరిగింది.