Ponguleti Srinivas Emotional On Paleru Incident| వరదలో కొట్టుకుపోయిన కూలీ కుటుంబంపై పొంగులేటి ఆవేదన
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPonguleti Srinivas Emotional On Paleru Incident | తన నియోజకవర్గం పాలేరులో ఓ కుటుంబం వరదలో కొట్టుకుపోవడంపై మాట్లాడుతూ.. వారిని కాపాడలేకపోయానంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు.
గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వరదల కారణంగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం నాయకన్ గూడెంకు చెందిన ఇటుకలపని చేసుకునే యాకూబ్ ఇళ్లు వరద నీటులో కొట్టుకుపోయింది. సడన్ గా వరద రావడంతో యాకుబ్ కుటుంబం ఇంటికి ఎక్కింది. తనను కాపాడాలని వేడుకున్నారు. ప్రభుత్వం కుడా సాయం చేసేందుకు ప్రయత్నించింది. కానీ, ఈ లోపే వరద ప్రవాహం ఎక్కువ కావడంతో గోడ కొట్టుకుపోయి యాకుబ్ వరద నీటిలో కొట్టుకుపోయారు. కాపాడే లేపే... వారు కొట్టుకుపోవడంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఎమోషనల్ అయ్యారు. ఓ కుటుంబాన్ని కాపాడలేకపోయానని ఆవేదనతో కంటతడి పెట్టుకున్నారు. ప్రజల పట్ల ఇది తమ నేతకు ఉన్న కమిట్మెంట్ అంటూ పొంగులేటి అనుచరులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.