Leaders Visit Hospitalized Basara IIIT Students: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు నాయకుల పరామర్శ
బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజనింగ్ వల్ల అస్వస్థతకు గురైన విద్యార్థినులను పలువురు రాజకీయ, విద్యార్థి సంఘాల నాయకులు పరిశీలించారు. సీపీఐ సీనియర్ నాయకుడు నిజామాబాద్ కు చేరుకుని విద్యార్థినుల ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. ఆసుపత్రికి చేరుకున్న NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ విద్యార్థినులను పరామర్శించారు. ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు.