Munugode By Poll | మునుగోడుకు నిధులు వరదలా పారతాయంటున్న బీజేపీ నేతలు. | ABP Desam

మునుగోడులో ఓల్డ్ బీజేపీ, తాజా బీజేపీ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాకను స్వాగతిస్తున్నారు. ఆయన్ను రాబోయే ఉప ఎన్నికల్లో గెలిపించుకుంటామని చెబుతున్నారు. మొదటినుంచి సాప్ట్ కార్నర్ ఉన్న రాజగోపాల్ ను తామెప్పుడు శత్రువుగా చూడలేదనీ, ఆయన బీజేపీని ఎప్పుడూ విమర్శించలేదని చెబుతున్నారు. మునుగోడుకు అధికార టీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదనీ, నిధులే రాలేదనీ వారు అంటున్నారు. ఉప ఎన్నికద్వారానైనా మునుగోడుకు మరిన్ని నిధులు వస్తాయని తాము భావిస్తున్నామని వారు చెబుతున్నారు. ఏబీపీ దేశం మునుగోడులో బీజేపీ నేతల అభిప్రాయాన్ని తీసుకుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola